బాల సాహితీవేత్తగా బుచ్చిరెడ్డి
ABN, First Publish Date - 2023-05-01T00:23:55+05:30
చండూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసు ్తన్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహితీవేత్తగా గుర్తిం పు లభించింది.
బాల సాహితీవేత్తగా బుచ్చిరెడ్డి
చండూరు, ప్రిల్ 30: చండూరు జిల్లా పరిషత ఉన్నత పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడిగా పనిచేసు ్తన్న కోమటిరెడ్డి బుచ్చిరెడ్డికి బాల సాహితీవేత్తగా గుర్తిం పు లభించింది. ప్రపంచ తెలుగు బాలల సాహితీవేత్తల పరిచయాలతో కూడిన బాలసాహితీ శిల్పులు సంకలన గ్రంథంలో బుచ్చిరెడ్డికి చోటు లభించినట్లు గ్రంఽథకర్త పై డిమర్రి రామకృష్ణ తెలిపారు. బాలసాహిత్యానికి బుచ్చిరెడ్డి చేస్తున్న కృషికి నల్లగొండ జిల్లా నుంచి ఎంపిక చేసినట్లు తెలిపారు. ఉమ్మడి తెలుగు రాష్ర్టాలతో పాటు ప్రపంచ తెలుగు రాష్ర్టాల నుంచి 101 మంది బాల సాహితీవేత్తలను గుర్తించినట్లు పేర్కొన్నారు. బుచ్చిరెడ్డి బాలల కోసం 15 సంవత్సరాల నుంచి 300 పైగా కథలు, గే యాలు, కవితలు రాశారని గుర్తు చేశారు. మొలకలు అనే పేరుతో పిల్లల కథల పుస్తకం రాశారు. ఆయన గతంలోనే సంటి అనిల్కుమార్ బాల సాహిత్య పురస్కారం పొందారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా బాలల కోసం బాలసభలు, బాల కవి సమ్మేళనాలు నిర్వహించడమే కాకుండా పిల్లల్లో దాగి ఉన్న సృజనాత్మకత వెలికి తీసే విధంగా కథలు రాయించి ప్రోత్సహిస్తున్నారు. ఆయన్ను బాల సాహితీవేత్తగా గుర్తించడంపై కవులు, రచయతలు, ఉపాధ్యాయులు, విద్యార్థులు హర్షం వ్యక్తం చేశారు.
Updated Date - 2023-05-01T00:23:55+05:30 IST