17న తిరుమలలో అణివార ఆస్థానం
ABN, First Publish Date - 2023-06-26T02:58:46+05:30
తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల అణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల
తిరుమల, జూన్ 25 (ఆంధ్రజ్యోతి): తిరుమల శ్రీవారి ఆలయంలో జూలై 17వ తేదీన సాలకట్ల అణివార ఆస్థానం ఘనంగా జరగనుంది. ఈ ఉత్సవం రోజున ఉదయం బంగారు వాకిలి ముందున్న ఘంటా మండపంలో సర్వభూపాల వాహనంలో ఉభయదేవేరులతో కూడిన మలయప్పస్వామిని గరుత్మంతుడికి అభిముఖంగా కొలువుకు వేంచేపు చేస్తారు. ఈ ఉత్సవమూర్తులతోపాటు ఆనందనిలయంలోని మూలవిరాట్టుకు ప్రత్యేక పూజలు, ప్రసాదాలు నివేదిస్తారు. ఆణివార ఆస్థానం సందర్భంగా సాయంత్రం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి పుష్పపల్లకిపై ఆలయ మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిస్తారు.
Updated Date - 2023-06-26T02:58:46+05:30 IST