ఫ్లోరోసిస్ విముక్తి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన స్వామి మృతి
ABN, First Publish Date - 2023-01-28T10:31:31+05:30
తనకు జరిగిన దారుణం మరెవరికీ జరగకూడదని భావించి సుదీర్ఘ కాలం పాటు ఫ్లోరోసిస్పై పోరాడిన అంశల స్వామి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు.
నల్లగొండ : తనకు జరిగిన దారుణం మరెవరికీ జరగకూడదని భావించి సుదీర్ఘ కాలం పాటు ఫ్లోరోసిస్పై పోరాడిన అంశల స్వామి ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. ఫ్లోరోసిస్ బాధితుడు అంశల స్వామి(32) నేడు మృతి చెందారు. జిల్లాలో ఫ్లోరోసిస్ విముక్తి కోసం స్వామి సుదీర్ఘ పోరాటం చేశారు. మర్రిగూడ మండలం శివన్నగూడెం దగ్గర బైక్పై నుంచి పడి అంశల స్వామి మృతి చెందారు. జిల్లాలో మిషన్ భగీరథ నీళ్లు, శివన్నగూడెం ప్రాజెక్టు సాధనకు అంశల స్వామి కృషి చేశారు.
Updated Date - 2023-01-28T10:31:33+05:30 IST