నీట్-పీజీ సీట్ల భర్తీకి మరోసారి కౌన్సెలింగ్
ABN, First Publish Date - 2023-09-22T02:37:43+05:30
పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ 2023 కటా్ఫను తగ్గించడంతో మరోమారు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు.
ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు 24వ తేదీ తుది గడువు
హైదరాబాద్, సెప్టెంబరు 21 (ఆంధ్రజ్యోతి): పీజీ వైద్య ప్రవేశాలకు సంబంధించిన నీట్ పీజీ 2023 కటా్ఫను తగ్గించడంతో మరోమారు కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నారు. ఈ మేరకు కాళోజీ ఆరోగ్య విశ్వవిద్యాలయం గురువారం ప్రకటన జారీ చేసింది. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ కటాఫ్ స్కోరును జీరో’ పర్సంటైల్ చేసిన సంగతి తెలిసిందే. ఈ నిర్ణయంతో నీట్ పీజీ 2023 పరీక్షకు హాజరైన వారంతా కౌన్సెలింగ్కు అర్హులు అవుతారు. కాగా, కౌన్సెలింగ్లో పాల్గొనాలనుకునే వారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ 21వ తేదీ(గురువారం) మధ్యాహ్నం 2 గంటల నుంచే ప్రారంభమైంది. సెప్టెంబరు 24 సాయంత్రం 6గంటల వరకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు అవకాశముంటుందని వర్సిటీ పేర్కొంది.
Updated Date - 2023-09-22T02:37:43+05:30 IST