మహిళా రైతు సుగుణకు సన్మానం
ABN, First Publish Date - 2023-03-30T22:42:18+05:30
నాగసముద్రం గ్రామానికి చెందిన నందుర్క సుగుణ మహిళా రైతును గురువారం జగిత్యాల జిల్లా పొలాస జిల్లా ప్రాంతీయ వ్యవసా య పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆమెను సన్మానించారు.
దండేపల్లి, మార్చి 30: నాగసముద్రం గ్రామానికి చెందిన నందుర్క సుగుణ మహిళా రైతును గురువారం జగిత్యాల జిల్లా పొలాస జిల్లా ప్రాంతీయ వ్యవసా య పరిశోధన, విస్తరణ సలహా సంఘం సమావేశంలో ఆమెను సన్మానించారు. సుగుణ సేంద్రియ సాగుతోపాటు విభిన్న రకాల పంటలు పండించడంతో ఆమెకు జాతీయ పురస్కారం లభించింది. పరిశోధన సంచాలకులు వెంకటరమణ, వ్యవసాయ విశ్వవిద్యాలయ విస్తరణ సంచాలకులు సుధారాణిలు సుగుణకు ఉత్తమ మహిళ రైతు అవార్డు అందజేశారు. సహాయ సంచాలకులు శ్రీనివాస్, విత్తన సంచాలకులు జగన్మోహన్రావు, వెంకటేశ్వర్లులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-30T22:42:18+05:30 IST