చండీహోమంలో పాల్గొన్న మంత్రి ఐకే రెడ్డి
ABN, First Publish Date - 2023-01-05T01:49:22+05:30
జిల్లా కేంద్రంలోని రాంనగర్ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న చండీసప్తశతి శ్రీలలితా హోమంలో బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నా రు.
నిర్మల్ కల్చరల్, జనవరి 4 : జిల్లా కేంద్రంలోని రాంనగర్ పంచముఖి ఆంజనేయస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న చండీసప్తశతి శ్రీలలితా హోమంలో బుధవారం దేవాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పాల్గొన్నా రు. ఆయనకు ఆలయ అభివృద్ధి కమిటీ అఖండ స్వాగతం పలికి సన్మా నించారు. చండీహోమం నిర్వహణతో ప్రజలు సుఖ సంతోషాలతో ఉండా లని అమ్మవారిని వేడుకున్నారు. మంత్రి వెంట జడ్పీ చైర్పర్సన్ విజయ లక్ష్మి, మున్సిపల్ చైర్మన్ ఈశ్వర్, ఎంపీపీ రామేశ్వర్రెడ్డి, ఏఎంసీ చైర్మన్ చిలుక రమణ, రైతు సంఘ అధ్యక్షుడు ధర్మాజీ రాజేందర్, పట్టణ బీఆర్ఎస్ అధ్యక్షుడు మారుగొండ రాము, మాజీ కౌన్సిలర్ ఆకోజి కిషన్ పాల్గొన్నారు.
మంత్రికి మహిళల సన్మానం
నిర్మల్ చైన్గేట్, జనవరి 4 : ఈద్గామ్ నుండి ఆదర్శనగర్, సిద్దాపూర్ వరకు రోడ్డు విస్తరణ, తారు రోడ్డు నిర్మాణం ప్రకటించిన సమయానికే నిర్మించడం పట్ల మాట నిలుపుకున్న మంత్రికి ఆదర్శనగర్ మహిళలు ధన్య వాదాలు తెలుపుతూ శాలువాతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో ఆదర్శ నగర్ వీరాంజనేయస్వామి దేవాలయం చైర్మన్ కామారపు భారతి, నళిని రెడ్డి, ఇతర మహిళలు పాల్గొన్నారు.
Updated Date - 2023-01-05T01:49:24+05:30 IST