ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

దరఖాస్తులను సత్వరమే పరిష్కరించాలి

ABN, First Publish Date - 2023-06-26T22:41:33+05:30

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు.

దరఖాస్తులు స్వీకరిస్తున్న కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మంచిర్యాల కలెక్టరేట్‌, జూన్‌ 26 : ప్రజావాణి కార్యక్రమంలో వచ్చి న దరఖాస్తులను సత్వరమే పరిష్కరించేందుకు జిల్లా అధికారులు కృషి చేయాలని జిల్లా కలెక్టర్‌ బదావత్‌ సంతోష్‌ అన్నారు. సోమవారం జిల్లా నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణిలో అర్జీదారుల నుంచి దరఖాస్తులను స్వీకరించారు. భీమిని మండలానికి చెందిన భీమయ్య వడాల గ్రామ శివారులో తమ తాతల భూమిని సాగు చేస్తున్నామని , పట్టా పాసు బుక్‌ అందజేయలని దరఖాస్తు అందజేశారు. మంచిర్యాల పట్టణానికి చెందిన మనోహర్‌ చెన్నూరు మండలంలోని నాగపురి శివారులో రామ్మూర్తి పేరిట ఉన్న జాయింట్‌ పట్టా ధరణిలో ఒకరి పేరుపై నమోదు చేశారని చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశాడు. మందమర్రి, జైపూర్‌, శ్రీరాంపూర్‌, నస్పూర్‌, బెల్లంపల్లి, కాసిపేట, నెన్నెల, జన్నారం, దండేపల్లి, రామకృష్ణపూర్‌ల నుంచి ప్రజలు వచ్చి దరఖాస్తులను అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ సంతోష్‌ మాట్లాడారు. నస్పూర్‌లోని నూతన కలెక్టరేట్‌ కార్యాలయంలో సంబంధిత శాఖల అధికారుల సమక్షంలో ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నామని చెప్పారు. ప్రజలు గమనించి ప్రతి సోమవారం ఉదయం 10.30 గంటల నుంచి నిర్వహించే ప్రజావాణిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. సంబంధిత శాఖల అధికారుల సమస్యల పరిష్కారానికి కృషి చేయాలన్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి స్పందన వచ్చిందని తెలిపారు. వైద్య ఆరోగ్య శాఖలోని సమస్యలపై 46 దరఖాస్తులు, సంక్షేమ శాఖకు సంబంధించి 41, వ్యవసాయ శాఖకు సంబంధించి 32, రెవెన్యూ శాఖకఉ సంబంధించి 27 దరఖాస్తులు వచ్చాయని చెప్పారు. ఇరిగేషన్‌ 28, ఇంటర్‌ విద్యాశాఖ 14, విద్యాశాఖ 18, మిషన్‌ భగీరథ 7, పంచాయతీ రాజ్‌ శాఖ 20, ఎస్సీ కార్పోరేషన్‌ 2 దరఖాస్తులు వచ్చాయని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్‌ రాహుల్‌, ట్రైనీ కలెక్టర్‌ గౌతమి, మంచిర్యాల, బెల్లంపల్లి ఆర్డీవో లు వేణు, శ్యామలాదేవి, జిల్లా అధికారులు దుర్గా ప్రసాద్‌, రవీందర్‌రెడ్డి, సంపత్‌కుమార్‌ సుబ్బారాయుడు, ఫయాజ్‌ఖాన్‌, నీలిమ, రజనీ, అంజన్‌రావు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2023-06-26T22:41:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising