ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

వైఎస్‌ అనుచరుడు.. సూరీడుపై కేసు నమోదు

ABN, First Publish Date - 2023-09-22T02:50:26+05:30

దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సహాయకుడిగా పనిచేసిన సూరీడుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు.

బంజారాహిల్స్‌, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర్‌రెడ్డికి సహాయకుడిగా పనిచేసిన సూరీడుపై జూబ్లీహిల్స్‌ పోలీసులు కేసు నమోదుచేశారు. ఆయనతోపాటు..ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఓ ఐపీఎస్‌ అధికారి, జూబ్లీహిల్స్‌ ఠాణాలో పనిచేసే ఇద్దరు అధికారులపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. జూబ్లీహిల్స్‌లో నివసించే సూరీడు తన కుమార్తెను ఏపీలోని కడపకు చెందిన డాక్టర్‌ సురేంద్రనాథ్‌ రెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. కొద్ది కాలానికి కుమార్తె, అల్లుడి మధ్య విభేదాలు తలెత్తాయి. దీంతో సూరీడు 2014లో జూబ్లీహిల్స్‌ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. కేసు నమోదైంది. 2021 మార్చిలో తన ఇంట్లోకి దౌర్జన్యంగా ప్రవేశించిన సురేంద్రనాథ్‌రెడ్డి.. తనను చంపేందుకు యత్నించాడంటూ సూరీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సూరీడు తప్పుడు ఫిర్యాదు చేశారని.. అతనికి ఏపీకి చెందిన ఐపీఎస్‌ అధికారి పాలరాజు, అప్పటి జూబ్లీహిల్స్‌ ఇన్‌స్పెక్టర్‌ రాజశేఖర్‌ రెడ్డి, ఎస్సై నరేశ్‌ సహకరించారని సురేంద్రనాథ్‌ కోర్టును ఆశ్రయించారు. ఇరువర్గాల వాదనలను నమోదు చేసుకున్న కోర్టు.. సూరీడు, పాలరాజు, రాజశేఖర్‌రెడ్డి, నరేశ్‌పై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. ఆ మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించినట్లు జూబ్లీహిల్స్‌ పోలీసులు వెల్లడించారు.

Updated Date - 2023-09-22T02:50:26+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising