India : ప్రాక్టీస్ మ్యాచ్లో చిత్తుగా..
ABN, First Publish Date - 2023-02-07T02:59:13+05:30
India lost the practice match by 44 runs
కేప్టౌన్: టీ20 వరల్డ్కప్ సన్నాహకాలను భారత మహిళల జట్టు పేలవంగా ఆరంభించింది. సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన తొలి ప్రాక్టీస్ మ్యాచ్లో భారత్ 44 రన్స్ తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్కు దిగిన ఆసీస్ 20 ఓవర్లలో 129/8 స్కోరు సాధించింది. శిఖా, దీప్తి, రాధా యాదవ్లకు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భారత్ 15.1 ఓవర్లలో 85 పరుగులకే కుప్పకూలింది. దీప్తి శర్మ (19 నాటౌట్), హర్లీన్ (12), తెలుగమ్మాయి అంజలీ శర్వాణి (11) రెండంకెల స్కోర్లు సాధించారు. బ్రౌన్కు 4 వికెట్లు దక్కాయి.
Updated Date - 2023-02-07T02:59:14+05:30 IST