ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

10 ఏళ్ల క్రితం తండ్రిని హత్య చేసి... ఇప్పుడు తల్లి గొంతు కోసి.. మామపై దాడికి తెగబడి... నరహంతకుని రియల్ స్టోరీ!

ABN, First Publish Date - 2023-02-06T10:39:08+05:30

బీహార్‌లోని మాధేపురాలో ఒక యువకుడు పింఛను కోసం తల్లి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీహార్‌లోని మాధేపురాలో ఒక యువకుడు పింఛను కోసం తల్లి గొంతు కోసి హత్య చేశాడు. ఈ ఘటన ఆ ప్రాంతంలో సంచలనంగా మారింది. పోలీసులు మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. గతంలో ఆ యువకుడు డబ్బుల కోసం తన తండ్రిని కూడా హత్య చేశాడని తెలుస్తోంది. ఈ నేపధ్యంలో అతనికి జైలు శిక్ష కూడా పడింది.

ఇప్పుడు తల్లిని హత్య చేసి పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ సంఘటన మురళిగంజ్ బ్లాక్ పరిధిలోని నాడి ఖాదీ పంచాయతీలోని 11వ వార్డు రహతాలో జరిగింది. ఇక్కడ నివసించే దేవేంద్ర యాదవ్ పీడబ్ల్యూడీలో నాలుగో తరగతి ఉద్యోగి. దేవేంద్ర ఎనిమిదేళ్ల క్రితం హత్యకు గురయ్యాడు. దీంతో కుటుంబానికి రూ. 8 లక్షలు అందాయి. ఆమెకు ప్రతి నెలా 11 వేల రూపాయల పెన్షన్ అందుతోంది. దానిని ఆమె దేవి పెద్ద కొడుకు శైలేంద్ర, చిన్న కొడుకు సంతోష్‌కి సమానంగా ఇచ్చేది. అయితే సంతోష్ ఆ ఫించను తనకే పూర్తిగా పింఛను ఇవ్వాలని డిమాండ్ చేసేవాడు. ఈ విషయమై తల్లీకొడుకుల మధ్య పలుమార్లు వాగ్వాదం జరుగుతుండేది.

తాజాగా జరిగిన వాగ్వాదంలో కోపోద్రిక్తుడైన సంతోష్ పదునైన ఆయుధంతో తల్లి గొంతు కోసి హత్య చేశాడు. తరువాత అక్కడి నుంచి పరారయ్యాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మహిళ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం తరలించారు. ఈ ఉదంతం గురించి ఎస్పీ రాజేష్ కుమార్ మాట్లాడుతూ ప్రావిడెంట్ ఫండ్ నుండి వచ్చే పింఛను కోసం నిందితుడు తన తల్లిని హత్య చేసినట్లు తెలిపారు.

నిందితుడు పదేళ్ల క్రితం తన తండ్రిని హత్య చేశాడు. ఈ కేసులో దోషిగా తేలడంతో జైలుకు కూడా వెళ్లాడు. కాగా డబ్బు కోసం అంధుడైన సంతోష్‌ తన మామపై కూడా దాడికి పాల్పడ్డాడని సమాచారం. అతని మామయ్యకు పిల్లలు లేరు. అతని భూమిని కాజేయాలని సంతోష్ ప్రయత్నించేవాడు. ఈ నేపధ్యంలోనే కొద్దిరోజుల క్రితం మామపై దాడికి పాల్పడ్డాడు. తాను ఎలాగోలా ప్రాణాలను కాపాడుకున్నానని, లేదంటే సంతోష్ తనను కూడా చంపేసేవాడని మామ నసీబాలాల్ పోలీసులకు తెలిపాడు.

Updated Date - 2023-02-06T10:39:10+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising