Viral News: బీచ్లో కనిపించిందో బ్యాగ్.. ఎవరూ తీసుకోకపోవడంతో ఓ వ్యక్తికి డౌట్.. ఆశగా వెళ్లి అందులో ఏముందో ఓపెన్ చేసి చూస్తే..!
ABN, First Publish Date - 2023-06-02T20:40:44+05:30
ముంబైకి సమీపంలోని సముద్ర తీరంలో శిరస్సులేని మహిళ మృతదేహం లభ్యమైంది. దీంతో, కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.
ఇంటర్నెట్ డెస్క్: అది ముంబైకి(Mumbai) సమీపంలో థానే జిల్లాలో గల సముద్రతీరం. శుక్రవారం తెల్లవారుజామును ఓ వ్యక్తి బీచ్లో నడుస్తుండగా ఓ పెద్ద బ్యా్గ్ అతడి కంట పడింది. దాన్ని చూడగానే ఆ వ్యక్తికి ఎందుకో డౌట్ వచ్చింది. వెంటనే వెళ్లి దాన్ని తెరిచి చూసి ఒక్కసారిగా దడుసుకున్నాడు. ఆ బ్యాగులో తల లేని మహిళ(Headless body of woman) మృతదేహం కనిపించడంతో బెదిరిపోయాడు. వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు.
మహిళ మొండెన్ని రెండు భాగాలుగా చేసినట్టు పోలీసులు గుర్తించారు. అంతేకాదు.. ఓ చేయిపై త్రిశూలం టాటూ, మరో చేయిపై ఓం అని హిందీలో రాసుండటాన్ని కూడా గుర్తించారు. అయితే, మహిళ ఎవరనేది మాత్రం తెలియరాలేదు.
దీంతో, పోలీసులు మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. మహిళ మృతదేహం తీరానికి కొట్టుకొచ్చిందా లేక ఎవరైనా చంపి ఇక్కడ పడేశారా? అనే కోణంలో విచారిస్తున్నారు.
Updated Date - 2023-06-02T20:41:03+05:30 IST