ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Allu Aravind: మీడియా సమావేశానికి సస్పెన్స్ ట్విస్ట్

ABN, First Publish Date - 2023-02-06T15:28:59+05:30

ఇవాళ సాయంత్రం ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు అన్న వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అఫ్ ది టౌన్ (Talk of the Town) గా అయిపొయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇవాళ సాయంత్రం ప్రముఖ అగ్ర నిర్మాత అల్లు అరవింద్ (Allu Aravind) మీడియా సమావేశం నిర్వహిస్తున్నారు అన్న వార్త చిత్ర పరిశ్రమలో పెద్ద టాక్ అఫ్ ది టౌన్ (Talk of the Town) గా అయిపొయింది. ఈ మీడియా సమావేశం లో దర్శకుడు పరశురామ్ (Director Parasuram), నిర్మాత దిల్ రాజు (Dil Raju) ల మీద అల్లు అరవింద్ కోపంగా వున్నారు అని కూడా బయటకి లీక్ అయింది. దీనితో ఇవాళ మధ్యాహ్న సమయానికే కొంతమంది నిర్మాతలు, అలాగే దర్శకుడు పరశురామ్ అందరూ అల్లు అరవింద్ గీత ఆర్ట్స్ (Geetha Arts office) ఆఫీస్ కి చేరుకున్నారు అని వినికిడి.

వీళ్లందరితో పాటుగా దిల్ రాజు మనుషులు కూడా అల్లు అరవింద్ ఆఫీస్ కి చేరుకున్నారని తెలిసింది. కొంతమంది నిర్మాతలు అల్లు అరవింద్ కి సర్ది చెప్తున్నారని, దర్శకుడు పరశురామ్ అయితే అల్లు అరవింద్ కి క్షమాపణలు చెప్పి ఈ మీడియా సమావేశం వద్దు అని బతిమాలుతున్నట్టుగా తెలిసింది. గిల్డ్ (Telugu Producers Guild), ప్రొడ్యూసర్ కౌన్సిల్ (Telugu Producers Council) నుండి కొంతమంది నిర్మాతలు వెళ్లి అరవింద్ ని కలిసి మీడియా సమావేశం రద్దు చేసుకోవాల్సిందిగా సూచించినట్టు తెలిసింది. రానున్న రోజుల్లో ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎలక్షన్స్ కూడా ఉండటం, ఇలా మీడియా సమావేశం పెట్టడంతో అందరి దృష్టి దాని మీద పడుతుందని, అందుకని ఆ మీడియా సమావేశం రద్దు చేసి, ఆఫీస్ లో మాట్లాడుకుంటే మంచిది అని సూచించారని తెలిసింది.

ఇంతమంది వెళ్లి చెప్పడం, దర్శకుడు పరశురామ్ కూడా వెళ్లి అరవింద్ గారికి క్షమాపణ చెప్పడం, ఇవన్నీ చూసి అరవింద్ గారు మీడియా సమావేశం రద్దు చేసుకునే అవకాశం వుంది అని కూడా తెలిసింది. అధికారికంగా ఈ రద్దు విషయం ఏ నిముషం లో అయినా అరవింద్ గారి పీఆర్ టీం తెలియచేయవచ్చు అని కూడా తెలిసింది. ఎంతో కోపంగా వున్న అల్లు అరవింద్ ని మొత్తానికి సినిమా పెద్దలు వెళ్లి శాంతి పరిచినట్టుగా తెలిసింది. మీడియా సమావేశం ఉండకపోవచ్చు. దర్శకుడు పరశురామ్ తన తదుపరి సినిమా విజయ్ దేవేరుకొండ (VIjay Deverakonda) తో ఉంటుందని, దానికి నిర్మాత దిల్ రాజు అని ఆదివారం ప్రకటించిన సంగతి తెలిసిందే.

Updated Date - 2023-02-06T17:16:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising