NRI: డిట్రాయిట్లో ‘కాంతితో క్రాంతి’...భారీగా తరలివచ్చిన ఎన్నారైలు
ABN, First Publish Date - 2023-10-09T21:17:38+05:30
డిట్రాయిట్లో ఎన్నారైలు టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ కాంతితో క్రాంతి కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
ఎన్నారై డెస్క్: తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అక్రమ అరెస్టును నిరసిస్తూ పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు డిట్రాయిట్లో ఉన్న ఎన్నారైలు ‘కాంతితో క్రాంతి’ కార్యక్రమంలో పాల్గొని చంద్రబాబుకు మద్దతు తెలియజేశారు. చలిని సైతం లెక్కచేయకుండా దాదాపు 150 మందికిపైగా ఎన్నారైలు ఈ కార్యక్రమంలో పాల్గొనడం విశేషం. ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ఎన్నారైలు క్యాండిల్ లైట్లతో సెల్ఫోన్ లైట్లతో పాల్గొని జగన్ ప్రభుత్వ దుశ్చర్యను తీవ్రంగా ఖండించారు.
Updated Date - 2023-10-09T21:18:33+05:30 IST