Republic Day : ఈ రిపబ్లిక్ డే మరింత ప్రత్యేకం!
ABN, First Publish Date - 2023-01-27T02:48:41+05:30
దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు నిర్వహిస్తున్న వేళ.. ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం
దేశ ప్రజలకు ప్రధాని మోదీ శుభాకాంక్షలు
న్యూఢిల్లీ, జనవరి 26: దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 ఏళ్లయిన సందర్భంగా ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ పేరిట వేడుకలు నిర్వహిస్తున్న వేళ.. ఈ గణతంత్ర దినోత్సవాన్ని జరుపుకోవడం మరింత ప్రత్యేకమని ప్రధాని మోదీ అన్నారు. ఈ సందర్భంగా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ‘భారతీయులందరికీ రిపబ్లిక్ డే శుభాకాంక్షలు. ఆజాదీ కా అమృత్ మహోత్సవం వేళ నిర్వహిస్తున్న ఈ గణతంత్ర వేడుకలు ఈసారి మరింత ప్రత్యేకం. గొప్ప స్వాతంత్య్ర సమరయోధుల కలలను నెరవేర్చేందుకు మనం ఐకమత్యంగా ముందుకు సాగాలి’ అని మోదీ ట్వీట్ చేశారు.
పొగమంచుతో నిరాశ..
రిపబ్లిక్ డే వేడుకల్లో వాయుసేన నిర్వహించే విన్యాసాలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంటాయి. వాటిని ప్రత్యక్షంగా తిలకించేందుకు ఎంతో ఆసక్తిగా వచ్చినవారిని పొగమంచు తీవ్ర నిరాశకు గురిచేసింది. ఢిల్లీలో గురువారం ఉదయం పొగమంచు అధికంగా ఉండడంతో దృశ్యమానత స్థాయి 800 మీటర్లకు తగ్గింది. దీంతో వాయుసేన విన్యాసాలను ప్రేక్షకులు పూర్తిగా ఆస్వాదించలేకపోయారు.
భారత గణతంత్ర దినోత్సవం సందర్భంగా గూగుల్ తన సెర్చింజన్లో డూడుల్తో ఇలా శుభాకాంక్షలు తెలిపింది.
Updated Date - 2023-01-27T02:48:42+05:30 IST