Sunstroke Deaths: మహారాష్ట్ర ప్రభుత్వంపై హత్య కేసు నమోదు చేయాలి: ఎన్సీపీ నేత అజిత్ పవార్
ABN, First Publish Date - 2023-04-18T16:07:35+05:30
ఈ విషాదం ఉద్దేశపూర్వకంగా కలిగించిన విపత్తు అని, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.
మహారాష్ట్ర: ఆదివారం నవీ ముంబై(Navi Mumbai)లో రాష్ట్ర అవార్డు కార్యక్రమంలో వడదెబ్బ కారణంగా13మంది మరణించిన విషయం తెలిసిందే. మహారాష్ట్ర ప్రభుత్వం(Maharashtra Government)పై హత్యానేరం కేసు నమోదు చేయాలని ప్రతిపక్ష నేత అజిత్ పవార్(NCP's Ajit Pawar) మంగళవారం డిమాండ్ చేశారు. ఈ మేరకు ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే(Chief Minister Eknath Shinde)కు లేఖ రాశారు. ఈ విషాదం ఉద్దేశపూర్వకంగా కలిగించిన విపత్తు అని, ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని లేఖలో పేర్కొన్నారు.
ఆదివారం ఖర్ఘర్లో జరిగిన మహారాష్ట్ర భూషణ్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో లక్షలాది మంది పాల్గొన్నారు. ఈ సమయంలో అవార్డు గ్రహీత అప్పాసాహెబ్ ధర్మాధికారి(Appasaheb Dharmadhikari) అనుచరులు, అభిమానులకు చాలామంది వడదెబ్బకు గురయ్యారు. ఈ ఘటనలో 13 మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారని అజిత్ పవార్ మండిపడ్డారు. దురదృష్టవశాత్తు ఇది ప్రకృతి విపత్తే అయినప్పటికీ ఎలాంటి సదుపాయాలు కల్పించకుండా మానవ తప్పితం చేసి అమాయకుల ప్రాణాలు బలిగొన్నారని తెలిపారు. ప్రభుత్వమే దీనికి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు.
Updated Date - 2023-04-18T16:08:43+05:30 IST