పోర్బందర్ టూ అసోం.. రాహుల్ తదుపరి యాత్ర!
ABN, First Publish Date - 2023-02-07T03:11:56+05:30
ఇటీవల ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన రాహుల్ గాంధీ త్వరలో మరో సుదీర్ఘ పాదయాత్ర చేసే అవకాశం ఉంది.
అహ్మదాబాద్, ఫిబ్రవరి 6: ఇటీవల ‘భారత్ జోడో యాత్ర’ను విజయవంతంగా పూర్తి చేసిన రాహుల్ గాంధీ త్వరలో మరో సుదీర్ఘ పాదయాత్ర చేసే అవకాశం ఉంది. ఆ యాత్ర గుజరాత్లోని పోర్బందర్లో మొదలై అసోం వరకు సాగనున్నట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి ఈ నెలాఖరున రాయ్పూర్లో జరగనున్న ఏఐసీసీ ప్లీనరీ సమావేశంలో నిర్ణయం తీసుకోనున్నట్లు పార్టీ సీనియర్ నేత ఒకరు తెలిపారు.
Updated Date - 2023-02-07T03:11:57+05:30 IST