వ్యక్తో లేక సిద్ధాంతమో దేశాన్ని విడదీయలేవు
ABN, First Publish Date - 2023-02-16T01:39:42+05:30
ఒక వ్యక్తో లేక ఒక సిద్ధాంతమో దేశాన్ని ముక్కలు చేయలేవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎ్సఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు.
ఆర్ఎస్ఎస్ చీఫ్ మోహన్ భాగవత్ వ్యాఖ్యలు
న్యూఢిల్లీ, ఫిబ్రవరి 15: ఒక వ్యక్తో లేక ఒక సిద్ధాంతమో దేశాన్ని ముక్కలు చేయలేవని రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్(ఆర్ఎ్సఎస్) చీఫ్ మోహన్ భాగవత్ అభిప్రాయపడ్డారు. ఒక బహిరంగ సమావేశం వేదికగా ఆయన చేసిన తాజా వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. ‘‘అనేక ఆలోచనలన్నింటినీ కలుపుకొని, అనేక వ్యవస్థల ఆధారంగా మంచిదేశాలనేవి ఎదుగుతాయి. ఒక వ్యక్తో, ఒక ఆలోచనో, బృందమో లేక సిద్ధాంతమో దేశాన్ని ముక్కలు చేయలేదు. అన్ని రకాల ఆలోచనలూ ఉండాలి’’ అని ఈ సందర్భంగా పేర్కొన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం, ‘ఒకే జాతి, ఒకే ఎన్నికలు’ అన్న విధానాన్ని అవలంబించాలని భావిస్తుండగా, భాగవత్ తాజా వ్యాఖ్యలు.. ఆ వైఖరికి వ్యతిరేకంగా ఉన్నాయని పరిశీలకులు చెబుతున్నారు.
Updated Date - 2023-02-16T07:06:11+05:30 IST