ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

RBI : ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌కు 2022-23లో 7 లక్షలకు పైగా ఫిర్యాదులు

ABN, First Publish Date - 2023-09-22T02:57:00+05:30

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ కింద తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నట్టు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయ

ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌కు 2022-23లో 7 లక్షలకు పైగా ఫిర్యాదులు

వాటిలో 97.99 శాతం పరిష్కారం

ఆర్బీఐ ఉన్నతాధికారుల వెల్లడి

(ముంబై నుంచి ఆంధ్రజ్యోతి ప్రతినిధి)

రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్బీఐ) తీసుకొచ్చిన ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌ కింద తమ సమస్యల పరిష్కారం కోసం వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ ఫిర్యాదులను వేగవంతంగా పరిష్కరించి బాధితులకు న్యాయం చేస్తున్నట్టు ముంబైలోని ఆర్బీఐ ప్రధాన కార్యాలయ ఉన్నతాధికారులు తెలిపారు. వినియోగదారుల్లో అవగాహన పెరుగుతుండటం వల్ల ఫిర్యాదులు ఎక్కువగా అందుతున్నట్టు పేర్కొన్నారు. ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మెన్‌ పథకం 2021 నవంబరు నుంచి అమల్లోకి వచ్చింది. ఇక 2021-22లో 4,18,189 ఫిర్యాదులు రాగా వాటిలో 97.97 శాతం పరిష్కారమయ్యాయి. 2022-23లో 7,03,544 ఫిర్యాదులు రాగా 97.99 శాతం పరిష్కరించామని అధికారులు తెలిపారు. బ్యాంకింగ్‌, ఎన్‌బీఎ్‌ఫసీ, డిజిటల్‌ లావాదేవీలకు సంబంధించిన ఫిర్యాదుల కోసం గతంలో 3 వేర్వేరు అంబుడ్స్‌మెన్‌ పథకాలున్నాయి. బ్యాంకింగ్‌ ఫిర్యాదులకు 1995 నుంచి, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలకు సంబంధించి 2018 నుంచి, డిజిటల్‌ లావాదేవీల కోసం 2019 నుంచి అంబుడ్స్‌మెన్‌ స్కీమ్‌లు పనిచేస్తున్నాయి. వీటిని ‘ఒకే దేశం, ఒకే అంబుడ్స్‌మన్‌’ పేరుతో ఇంటిగ్రేటెడ్‌ అంబుడ్స్‌మన్‌ పథకంతో కలిపారు. టోల్‌ఫ్రీ నం.14448 కు ఫోన్‌ చేసి ఫిర్యాదు చేసే అవకాశం కల్పించారు. హిందీ, ఇంగ్లి్‌ష, తెలుగుతోపాటు మరో 8 ప్రాంతీయ భాషల్లో బాఽధితులు తమ ఫిర్యాదు చేయవచ్చు. ఈ పథకం ద్వారా ఉచితంగా సేవలు పొందవచ్చు. బాధితులు సమస్యలపై ముందుగా సంబంధిత బ్యాంక్‌, నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీలను సంప్రదించాలి. ఇచ్చిన ఫిర్యాదును ఆయా సంస్థలు పరిష్కరించకపోతే నెల నుంచి ఏడాది లోపు అంబుడ్స్‌మన్‌కు ఫిర్యాదు చేయవచ్చు. బాధితులు ఇబ్బందులు కలిగించిన బ్యాంక్‌, ఎన్‌బీఎ్‌ఫసీ వివరాలు, కలిగిన నష్టం, కోరుతున్న పరిహారానికి సంబంధించిన పత్రాలు జతచేసి ఆర్బీఐ నిర్వహణ పోర్టల్‌ ఛిఝట.టఛజీ.ౌటజ.జీుఽలో లాగిన్‌ అయి ఫిర్యాదు చేయవచ్చు. నిర్దేశిత ఫార్మాట్‌ ప్రకారం పోస్ట్‌ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని అధికారులు తెలిపారు.

Updated Date - 2023-09-22T02:57:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising