Movie actress Gayatri: కరుణ కలం స్థూపానికి మద్దతు తెలుపుతున్నా..
ABN, First Publish Date - 2023-02-02T08:33:14+05:30
స్థానిక మెరీనా తీరంలో దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కలం స్మారకస్థూపం నిర్మాణానికి బీజేజీ మాజీ మహిళా నేత, సినీనటి
అడయార్(చెన్నై), ఫిబ్రవరి 1: స్థానిక మెరీనా తీరంలో దివంగత ముఖ్యమంత్రి ఎం. కరుణానిధి కలం స్మారకస్థూపం నిర్మాణానికి బీజేజీ మాజీ మహిళా నేత, సినీనటి గాయత్రి(Movie actress Gayatri) తన సంపూర్ణ మద్దతు తెలిపారు. ఇదే విషయంపై ఆమె తన ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. పెన్ను ప్రతి ఒక్కరూ ఉపయోగించేది. దీన్ని స్థాపించేందుకు కేంద్రం అనుమతిచ్చింది. ఇది కేవలం ఒక కలం లాగా కాకుండా, ప్రతి ఒక్కరూ వచ్చి చూడదగిన పర్యాటక ప్రాంతంగా ఉండాలి. దీన్ని హోలోగ్రాఫిక్ లేదా లేజర్ లైట్లతో రాష్ట్ర చరిత్రలో నిలిచిపోయేలా ఉండాలి. కలం చిహ్నం ఒక రాజకీయపార్టీకి చెందినదిగాకాకుండా ప్రతిఒక్కరూ మెచ్చకునేలాఉండాలి. తుఫానులువంటి ప్రకృతివైపరీత్యాల్లోనూ ధ్వంసంకాకుండాస్థాపించాలని ఆమె కోరారు.
Updated Date - 2023-02-02T08:33:16+05:30 IST