మధ్యప్రదేశ్లో యువతిపై గ్యాంగ్ రేప్
ABN, First Publish Date - 2023-07-17T01:19:12+05:30
యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులు, ఆమె మైనర్ సోదరిని కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. నిందితుల్లో అధికార బీజేపీ నేత కుమారుడు కూడా
నలుగురు నిందితుల్లో బీజేపీ నేత కొడుకు
భోపాల్, జూలై16: యువతిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డ నలుగురు యువకులు, ఆమె మైనర్ సోదరిని కూడా లైంగిక వేధింపులకు గురిచేశారు. నిందితుల్లో అధికార బీజేపీ నేత కుమారుడు కూడా ఉన్నాడు. మధ్యప్రదేశ్లోని దతియా జిల్లాలో ఈ దారుణం జరిగింది. ఈ క్రమంలోనే బాధితురాలు ఆత్మహత్యాయత్నం చేసింది. తమపై జరిగిన దారుణంపై యువతి సోదరి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. హోంమంత్రి నరోత్తమ్ మిశ్రా ప్రాతినిధ్యం వహిస్తున్న దతియా అసెంబ్లీ నియోజకవర్గంలోనే ఈ దారుణం జరగడంపై రాజకీయం దుమారం రేగుతోంది.
Updated Date - 2023-07-17T01:19:12+05:30 IST