ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Electric bus: బెంగళూరు - మైసూరుల మధ్య రేపు ఎలక్ట్రిక్‌ బస్సు

ABN, First Publish Date - 2023-01-15T11:58:12+05:30

బెంగళూరు, మైసూరు(Bangaluru, Mysore) నగరాల మధ్య ఎలక్ట్రిక్‌ బస్సు సేవలు అందు బాటులోకి రానున్నాయి. కర్ణాటక రాష్ట్ర

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు, జనవరి 14 (ఆంధ్రజ్యోతి): బెంగళూరు, మైసూరు(Bangaluru, Mysore) నగరాల మధ్య ఎలక్ట్రిక్‌ బస్సు సేవలు అందు బాటులోకి రానున్నాయి. కర్ణాటక రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (కేఎస్‌ఆర్టీసీ) కేంద్రప్రభుత్వ ఫేమ్‌-2 పథకం కింద అంతర నగరాల మధ్య ఎలక్ట్రిక్‌ బస్సు సేవలను ప్రారంభించనుంది. ఇప్పటికే శుక్రవారం ప్రయో గాత్మ కంగా చేపట్టగా విజయవంతమైంది. మరో నెలరోజుల్లో బెంగళూరు నుంచి దావణగెరె, చిక్కమగళూరు, శివ మొగ్గ, మడికేరి, విరాజ్‌పేటలకు ఎలక్ట్రిక్‌ బస్సు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఒలెకాట్ గ్రీన్‌టెక్‌ కంపెనీ నుంచి జీసీసీ (గ్రాస్‌ కాస్ట్‌ కాంట్రాక్టు) పద్ధతిన 50 బస్సులను కేఎస్‌ఆర్టీసీ పొందుతోంది. ఇందులో మొదటి బస్సు ఈ మార్గంలో సంచరించనుంది. మిగిలిన 49 బస్సులు వివిధ దశలలో రోడ్డెక్కనున్నాయి. మైసూరు, మడికేరి, విరాజ్‌పేట, దావణగెరె, శివమొగ్గ, చిక్క మగళూరుల మధ్య సంచరించనున్నాయని కేఎస్‌ఆర్టీసీ ఎండీ వీ అన్బుకుమార్‌ నగరంలో మీడియాకు తెలిపారు. ఈ బస్సు బ్యాటరీ ఒకసారి చార్జ్‌ చేస్తే 320 కిలో మీటర్ల మేర సంచరిస్తుందన్నారు. ఆరు చోట్ల చార్జింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ ఒక గంట చార్జ్‌ చేసుకుని మళ్లీ రాజధానికి వస్తాయన్నారు.

Updated Date - 2023-01-15T11:58:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising