రోడ్డు ప్రాజెక్టులను త్వరగా పూర్తి చేయండి
ABN, First Publish Date - 2023-05-18T03:26:49+05:30
తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జాతీయ రహదారులు, ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర
● కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీకి కిషన్రెడ్డి వినతి
న్యూఢిల్లీ, మే 17 (ఆంధ్రజ్యోతి): తెలంగాణ రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న రహదారుల పనులను త్వరగా పూర్తి చేయాలని జాతీయ రహదారులు, ఉపరితల రవాణ శాఖ మంత్రి నితిన్ గడ్కరీని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో గడ్కరీ నివాసంలో ఆయనను కలిసిన కిషన్రెడి.... రాష్ట్రంలో జరుగుతున్న రహదారుల నిర్మాణ పురోగతి, కొత్త ప్రాజెక్టులు తదితర అంశాలపై చర్చించారు. నిర్మాణంలో ఉన్న రహదారి ప్రాజెక్టులను వెంటనే పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. మరోవైపు.. కేంద్ర మాజీ మంత్రి షానవాజ్ హుస్సేన్, కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆయన నివాసంలో కలుసుకున్నారు. బిహార్లోని విక్రమశిల మహావిహార విశ్వవిద్యాలయానికి సంబంధించిన వివిధ పనులు చేపట్టాలని కిషన్రెడ్డికి వినతిపత్రం సమర్పించారు.
Updated Date - 2023-05-18T03:26:49+05:30 IST