ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కాగుతున్న కావేరి!

ABN, First Publish Date - 2023-09-22T02:51:20+05:30

తమిళనాడుకు కావేరి జలాల విడుదల వివాదం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు రోజుకు 5వేల

కర్ణాటకకు సుప్రీంలో చుక్కెదురు

తమిళనాడుకు నీటి విడుదల ఆదేశాల్లో జోక్యం చేసుకోబోమన్న కోర్టు

బెంగళూరు, సెప్టెంబరు 21(ఆంధ్రజ్యోతి): తమిళనాడుకు కావేరి జలాల విడుదల వివాదం కర్ణాటకలో ప్రకంపనలు రేపుతోంది. ఈ వ్యవహారంలో ఆ రాష్ట్రానికి సుప్రీంకోర్టులో మరోసారి ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడుకు రోజుకు 5వేల క్యూసెక్కుల చొప్పున 15రోజులపాటు కావేరీ జలాలను విడుదల చేయాలని కావేరీ నీటి నిర్వహణ అథారిటీ, కావేరి జలాల నియంత్రణ కమిటీ ఇచ్చిన ఆదేశాల్లో జోక్యానికి సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. అలాగే రోజుకు 5 వేల క్యూసెక్కులు చాలవని.. 7,200 క్యూసెక్కులు విడుదల చేయాలని తమిళనాడు దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణకు కూడా జస్టిస్‌ బీఆర్‌ గవాయ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహ, జస్టిస్‌ ప్రశాంత్‌కుమార్‌ మిశ్రాతో కూడిన త్రిసభ్య ధర్మాసనం నిరాకరించింది. ఆయా కమిటీల్లో నిపుణులు ఉన్నారని.. వర్షపాతం, కరువు, నీటి లభ్యత, అవసరం గురించి వారికి తెలుసని వ్యాఖ్యానించింది. ఈ తీర్పుతో కర్ణాటకవ్యాప్తంగా వివిధ సంస్థలు ఆందోళనకు దిగాయి. ముఖ్యంగా కావేరి బేసిన్‌లోని రైతాంగం ఉడికిపోతోంది. బెంగళూరు నగర ప్రజలు కూడా కావేరి జలాలపైనే ఆధారపడడంతో తాగునీటి సమస్య తప్పదేమోనని ఆందోళన చెందుతున్నారు. మరోవైపు.. సుప్రీం తీర్పు కాంగ్రెస్‌ ప్రభుత్వ వైఫల్యమేనని మాజీ సీఎంలు బీఎస్‌ యడ్యూరప్ప, బసవరాజ్‌ బొమ్మై మండిపడ్డారు.

Updated Date - 2023-09-22T02:51:20+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising