ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

లండన్‌లో హైదరాబాద్‌ వాసి హత్య

ABN, First Publish Date - 2023-10-03T03:43:27+05:30

ఉపాధి నిమిత్తం లండన్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌ వాసిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి హతమార్చడంతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి.

ఈ నెల 5న కుమార్తె పెళ్లి ఉండగా దుర్ఘటన

హైదరాబాద్‌ సిటీ, అక్టోబరు 2 (ఆంధ్రజ్యోతి): ఉపాధి నిమిత్తం లండన్‌లో నివసిస్తున్న హైదరాబాద్‌ వాసిని ఇద్దరు దుండగులు కత్తులతో పొడిచి హతమార్చడంతో ఆయన ఇంటి వద్ద విషాద ఛాయలు అలుముకున్నాయి. హైదరాబాద్‌కు చెందిన మహమ్మద్‌ ఖాజా రయిసుద్దీన్‌(65) లండన్‌లోని వెస్ట్‌ యార్క్‌షైర్‌లో 2011 నుంచి నివాసముంటున్నారు. భారత కాలమానం ప్రకారం శనివారం రాత్రి ఆయన స్నేహితుడైన ఆఫ్ఘాన్‌ దేశస్థుడి(53)తో కలిసి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు వారిద్దరినీ విచక్షణారహితంగా పొడిచి చంపేసినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనలో రయిసుద్దీన్‌తో పాటు ఆయన స్నేహితుడు మృతి చెందారు. ఈ నెల 5న రయిసుద్దీన్‌ కుమార్తె పెళ్లి ఉండడంతో అందరూ ఆ ఏర్పాట్లలో ఉన్నారు. ఈలోగా ఈ ఘటన చోటు చేసుకుందని మృతుని కుటుంబీకులను పరామర్శించిన ఎంబీటీ నేత అంజదుల్లా ఖాన్‌ తెలిపారు. ఆ కుటుంబానికి సాయం అందించాలని.. వెంటనే మృతుని నివాసం వద్దకు లండన్‌లో ఉన్న ఇండియన్‌ హై కమిషన్‌ ప్రతినిధులు చేరుకుని తగిన చర్యలు తీసుకోవాలంటూ ఆయన విదేశాంగ శాఖ మంత్రి సుబ్రమణ్యం జై శంకర్‌కు మెయిల్‌ చేశారు.

Updated Date - 2023-10-03T03:43:27+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising