రైతు-కూలీ సంఘం రాష్ట్ర మహాసభ
ABN, First Publish Date - 2023-04-25T00:56:41+05:30
రైతు-కూలీలు భూములు దక్కేలా, కూలీ రేట్లు పెరిగేలా పోరాడుతూ, పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు అండగా..
రైతు-కూలీలు భూములు దక్కేలా, కూలీ రేట్లు పెరిగేలా పోరాడుతూ, పోడు చేసుకుంటున్న ఆదివాసీలకు అండగా నిలబడుతున్న రైతు-కూలీ సంఘం ఏప్రిల్ 25, 26, 27 తేదీలలో యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరులో రాష్ట్ర రెండవ మహాసభలను నిర్వహించుకుంటున్నది. రైతుల ఆత్మహత్యల్లో దేశంలోనే రాష్ట్రం రెండవ స్థానంలో ఉన్నది. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల రైతాంగ విధానాలకు వ్యతిరేకంగా రైతు- కూలీలను సమీకరించే కర్తవ్యాలకు ఈ మహాసభలు పదును పెట్టుకోబోతున్నాయి. ఈ సభల్లో AIKMS అఖిల భారత ప్రధాన కార్యదర్శి అశోక్ ఘాయల్, ప్రొఫెసర్ కె.లక్ష్మీనారాయణ, AIKMS అఖిల భారత నాయకులు చిట్టిపాటి వెంకటేశ్వర్లు, కన్నెగంటి రవి తదితరులు పాల్గొంటున్నారు.
– బి.భాస్కర్, రాష్ట్ర సహాయ కార్యదర్శి
అఖిల భారత రైతు-కూలీ సంఘం (AIkms), తెలంగాణ రాష్ట్ర కార్యవర్గం
Updated Date - 2023-04-25T00:56:41+05:30 IST