ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

ఏఐతో పనితీరు మెరుగుపడుతుంది..

ABN, First Publish Date - 2023-09-17T02:59:00+05:30

పనిలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై హైదరాబాద్‌లోని మెజారిటీ వృత్తి నిపుణులు అమితాసక్తి కనబరుస్తున్నారని ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌ తాజా అధ్యయన...

పనిలో కృత్రిమ మేధస్సు వినియోగంపై హైదరాబాద్‌ ప్రొఫెషనల్స్‌లో అమితాసక్తి

  • 10లో 8 మంది అభిప్రాయమిదే..

  • లింక్డ్‌ఇన్‌ అధ్యయన నివేదిక వెల్లడి

హైదరాబాద్‌: పనిలో కృత్రిమ మేధ (ఏఐ) వినియోగంపై హైదరాబాద్‌లోని మెజారిటీ వృత్తి నిపుణులు అమితాసక్తి కనబరుస్తున్నారని ప్రపంచంలో అతిపెద్ద ప్రొఫెషనల్‌ నెట్‌వర్క్‌ లింక్డ్‌ఇన్‌ తాజా అధ్యయన నివేదిక వెల్లడించింది. ఎక్కడి నుంచి ప్రారంభించాలో తెలియకపోయినప్పటికీ, ఏఐ గురించి లోతుగా తెలుసుకోవాలనుకుంటున్నట్లు తమ సర్వేలో పాల్గొన్న ప్రతి పదిలో 7 మంది (69 శాతం) తెలిపారు. ఏఐతో పనితీరు గణనీయంగా మెరుగవుతుందని ప్రతి 10 మంది ప్రొఫెషనల్స్‌లో 8 మంది (79 శాతం) అభిప్రాయపడ్డారని రిపోర్టు పేర్కొంది. చాట్‌ జీపీటీ వంటి జనరేటివ్‌ ఏఐ సాంకేతికతను తమ పనిలో ఇప్పటికే ఉపయోగిస్తున్నట్లు 64 శాతం మంది వెల్లడించారు. ప్రతి ఇద్దరిలో ఒక్కరు చాట్‌జీపీటీ వినియోగిస్తున్నట్లు తెలిపారు. అయితే, కృత్రిమ మేధతో పని చేసే చోట వచ్చే మార్పులను అందుకోలేకపోతామేమోనని మాత్రం 42 శాతం మంది ప్రొఫెషనల్స్‌ ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా చూస్తే, పనిలో చాట్‌జీపీటీ వినియోగిస్తున్న వారిలో మిలీనియల్సే (54 శాతం) అధికం. జనరేషన్‌ జెడ్‌ (46 శాతం) ఆ తర్వాత స్థానంలో ఉన్నారు. 1981-1996 మధ్యకాలంలో జన్మించిన వారిని మిలీనియల్స్‌, 1996-2010 మధ్య జన్మించిన వారిని జనరేషన్‌ జెడ్‌గా పిలుస్తారు.

Updated Date - 2023-09-17T02:59:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising