Home » Businesss
దేశంలోకి విపరీతంగా పెరుగుతున్న వెండి ఇన్ఫ్లోను నియంత్రించడానికి, పెరుగుతున్న వాణిజ్య లోటును అరికట్టడానికి కేంద్ర ప్రభుత్వం ఒక కీలక నిర్ణయం తీసుకుంది.
నిన్న భారీ లాభాలు, దాదాపు ఈ వారమంతా తీవ్ర ఒడుదొడుకుల్ని ఎదుర్కొన్న భారత స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ వారాంతాన్ని(శుక్రవారం) స్వల్ప నష్టాలతో ముగించాయి. ఇవాళ ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్ 161 పాయింట్లు, నిఫ్టీ 46 పాయింట్ల నష్టంతో ముగిశాయి.
పొదుపు చర్యలు, ఆహారపు అలవాట్లపై ప్రధాని నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలు చర్చనీయాంశంగా మారాయి. వంటల్లో నూనె వాడకాన్ని తగ్గించాలని ఆయన ఇచ్చిన పిలుపు వెనుక దేశ ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేసే అంతర్లీన లక్ష్యం కూడా ఉంది.
ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని తన హైదరాబాద్ పర్యటన సందర్భంగా దేశ ప్రజలకు పిలుపునిచ్చారు ప్రధాని మోదీ. అయితే.. ఆయన ఎందుకు ఈ రకమైన వ్యాఖ్యలు చేశారు. ఆ ప్రభావం ధరలపై ఎలా ఉండనుందనే విషయాన్ని ఓ సారి పరిశీలిస్తే...
గృహ రుణాలు తీసుకునేటప్పుడు చెల్లింపు కాలపరిమితి కూడా ముఖ్యమే. ఈ కాలపరిమితి చెల్లింపు సామర్థ్యాన్ని బట్టి వీలైనంత వరకు తక్కువగా ఉండడమే మంచిది.
ఇవాళ హైదరాబాద్తో పాటు దేశవ్యాప్తంగా ప్రధాన నగరాల్లో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. దేశంలోని ముఖ్య నగరాల్లో 24 క్యారెట్ల పది గ్రాముల పుత్తడి ధర దాదాపు రూ.1,51,000గా కొనసాగుతోంది. ఇక, వెండి రేటు కిలోకు వంద రూపాయల మేర పెరిగింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న ఒక నిర్ణయం ప్రపంచ ఇంధన సరఫరా వ్యవస్థను అతలాకుతలం చేస్తోంది. హోర్ముజ్ జలసంధి వద్ద అమెరికా విధిస్తున్న నౌకాదళ దిగ్బంధనం కారణంగా అంతర్జాతీయ షిప్పింగ్ రంగం చరిత్రలో ఎన్నడూ లేనంతటి గడ్డు కాలాన్ని ఎదుర్కొంటోంది.
కొత్త ఆర్థిక సంవత్సరం (2026-27)లోనూ దేశీయ స్టాక్ మార్కెట్ ఊగిసలాడుతోంది. ఈ ఊగిసలాటతో గత రెండేళ్లుగా రేసుగుర్రాల్లా పరుగెత్తిన సూచీలు ఇప్పుడు తీవ్ర ఆటుపోట్లు ఎదుర్కొంటున్నాయి....
కొన్ని రోజులుగా అమెరికా, ఇజ్రాయెల్ - ఇరాన్ మధ్య యుద్ధం అంతర్జాతీయంగా బంగారం, వెండి ధరలను ప్రభావితం చేస్తోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కాల్పుల విరమణను పొడిగించిన తర్వాత దేశీయ మార్కెట్లలో వీటి ధరలు స్వల్పంగా పెరిగాయి.
ప్రభుత్వ అనుమతులు లేని కారణంగా భారతీయ బ్యాంకులు బంగారం, వెండి దిగుమతులను నిలిపివేసినట్టు మీడియాలో కథనాలు వెలువడ్డాయి. ఈ నెల మొదట్లోనే రావాల్సిన అనుమతులు ఇప్పటికీ రాలేదని తెలుస్తోంది.