లిఖిత ఇన్ఫ్రాకు రూ.235 కోట్ల ఆర్డర్
ABN, First Publish Date - 2023-07-21T01:24:36+05:30
ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ నుంచి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.235.5 కోట్ల ఆర్డర్ లభించింది...
హైదరాబాద్ (ఆంధ్రజ్యోతి బిజినెస్): ప్రభుత్వ రంగ సంస్థ గెయిల్ నుంచి లిఖిత ఇన్ఫ్రాస్ట్రక్చర్కు రూ.235.5 కోట్ల ఆర్డర్ లభించింది. తమిళనాడులోని సేలం నుంచి కోయంబత్తూర్ మధ్య పైప్లైన్ వేయడానికి ఈ ఆర్డర్ లభించిందని, దీన్ని 15 నెలల్లో పూర్తి చేయాలని లిఖిత ఇన్ఫ్రా వెల్లడించింది. పశ్చిమ బెంగాల్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో గ్యాస్, చమురు రవాణా కోసం గెయిల్ పైపులైన్లను నిర్మిస్తోంది.
Updated Date - 2023-07-21T01:24:36+05:30 IST