ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కొత్త ఇంటి పునాది తడుపుతుండగా..

ABN, First Publish Date - 2023-10-09T01:09:07+05:30

సొంతింటి ఆనందం ఆవిరైంది.. ఇంటికి వాటరింగ్‌ చేస్తుండగా వైర్ల నుంచి విద్యుత్‌ ప్రవహించి ఓ వ్యక్తి మృతిచెందాడు.

కడియం, అక్టోబరు 8 : సొంతింటి ఆనందం ఆవిరైంది.. ఇంటికి వాటరింగ్‌ చేస్తుండగా వైర్ల నుంచి విద్యుత్‌ ప్రవహించి ఓ వ్యక్తి మృతిచెందాడు. కడియపులంక గ్రామానికి చెందిన కాకిలేటి చినవెంకన్న(56) ఇటీవల ఇంటి నిర్మాణం ప్రారంభించాడు. తాపీ మేస్ర్తీలు పునాది వరకూ నిర్మించారు. ప్రతి రోజూ ఉదయం వచ్చి పునాది తడుపుతున్నాడు. రోజూలాగే ఆదివారం ఉదయం కూడా ఇంటివద్దకు చేరుకుని పునాది తడుపుతుండగా వైర్ల నుంచి విద్యుత్‌ ప్రవహించి ఒక్కసారిగా షాక్‌ కొట్టింది. దీంతో గట్టిగా అరిచిపడిపోయాడు. ఏం జరిగిందో స్థానికులకు అర్ధంకాలేదు. అపస్మారక స్థితితో ఉన్న వెంకన్నను వెంటనే స్థానికులు కడియం సీహెచ్‌సీకి తరలించారు.అయితే అప్పటికే వెంకన్న మృతిచెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపించారు.

Updated Date - 2023-10-09T01:09:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising