ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వైసీపీ నేత మద్యం బాగోతం!

ABN, First Publish Date - 2023-02-07T03:43:07+05:30

మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నేతగా చలామణి అవుతున్న పజ్జూరు శ్రీకాంత్‌ అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మైలవరం, ఫిబ్రవరి 6: మైలవరం నియోజకవర్గంలో వైసీపీ నేతగా చలామణి అవుతున్న పజ్జూరు శ్రీకాంత్‌ అక్రమ మద్యం వ్యాపారం గుట్టు రట్టయింది. శ్రీకాంత్‌ చేసేది ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్‌మన్‌ ఉద్యోగం. అదనంగా మైలవరం వైసీపీ సోషల్‌ మీడియా కో కన్వీనర్‌ హోదా. మంత్రి జోగి రమేశ్‌ సామాజికవర్గానికి చెందిన వ్యక్తి కావడంతో తనకు అడ్డేముందనుకున్నాడు. అక్రమార్జన సాగిస్తున్నాడు. చివరికి ఎక్సైజ్‌ పోలీసులకు చిక్కాడు. ఎక్సైజ్‌ ఏసీ స్క్వాడ్‌ ఎస్‌ఐ ఎ.ప్రసాదరావు కథనం ప్రకారం శ్రీకాంత్‌ జి.కొండూరులోని ప్రభుత్వ మద్యం షాపులో సేల్స్‌మన్‌గా పని చేస్తున్నాడు. సోమవారం అతడు 65 మద్యం (180 ఎమ్‌ఎల్‌) సీసాలు పినపాకకు చెందిన ఉండ్రకొండ నాగరాజుకు అక్రమంగా విక్రయిస్తుండగా ఎక్సైజ్‌ పోలీసులు పట్టుకున్నారు. నేరం రుజువు కావడంతో అతడిని ఉద్యోగం నుంచి తప్పించినట్లు తెలిపారు. నాగరాజుపైనా కేసు నమోదు చేశామన్నారు.

Updated Date - 2023-02-07T03:43:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising