ప్రియుడి చేతిలో హతం
ABN, First Publish Date - 2023-06-01T00:14:07+05:30
మహిళపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన నూజివీడులో జరిగింది.
నూజివీడు టౌన్, మే 31: మహిళపై కర్రతో దాడి చేయడంతో ఆమె తీవ్ర గాయాలపాలై మృతి చెందిన ఘటన నూజివీడులో జరిగింది. గుంటూరు జిల్లా పెదకాకానికి చెందిన పిడపర్తి హైమవతి (25) తన భర్త నుంచి విడిపోయి కొంతకాలంగా నూజివీడు ఎమ్మార్ అప్పారావు కాలనీలో ఉంటోంది. కాలనీకి చెందిన గరికె కోటయ్యతో సహజీవనం చేస్తోంది. ఇటీవల వీరికి మనస్పర్థలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో మంగళవారం రాత్రి ఇద్దరి మధ్యా మాటామాటా పెరగడంతో హైమవతిపై కోటయ్య విచక్షణా రహితంగా దాడి చేయగా ఆమె సంఘటనా స్థలంలోనే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో హైమవతి మృతదేహాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. నిందితుడు పరారీలో ఉన్నాడు. వీఆర్వో బాజీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నూజివీడు పట్టణ సీఐ ఎం.వి.ఎస్.ఎస్.ఎన్ మూర్తి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-06-01T00:14:07+05:30 IST