ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కలెక్టర్‌ ప్రశాంతికి రాష్ట్రస్థాయి అవార్డు

ABN, First Publish Date - 2023-01-25T00:35:35+05:30

జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి రాష్ట్రస్థాయి బెస్ట్‌ అవార్డు లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

భీమవరం/ నరసాపురం, జనవరి 24 : జిల్లా కలెక్టర్‌ పి.ప్రశాంతికి రాష్ట్రస్థాయి బెస్ట్‌ అవార్డు లభించింది. రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ రాష్ట్రస్థాయి బెస్ట్‌ ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపిక చేసినట్టు రాష్ట్ర ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా ప్రకటించారు. ఈ అవార్డును 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా 25వ తేదీ బుధవారం విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో అందజేస్తారు. ఓటరు చైతన్య కార్యక్రమాలను విజయవంతంగా పూర్తి చేసినందుకు రాష్ట్రంలో ఎంపిక చేసిన ముగ్గురు కలెక్టర్లలో మన జిల్లా కలెక్టర్‌ కూడా ఉన్నారు.

పీచుపాలెం సచివాలయం వెల్ఫేర్‌ సెక్రటరీకి..

అదేవిధంగా నరసాపురంలోని పీచుపాలెం సచివాలయంలో వెల్ఫేర్‌ సెక్రటరీగా పని చేస్తున్న ఎం.జయలక్ష్మి రాష్ట్రస్థాయిలో ఎలకో్ట్రలర్‌ ప్రాక్టీస్‌ అవార్డుకు ఎంపికైంది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ‘ఉద్యోగంలో చేరి మూడేళ్లయింది. తక్కువ కాలంలో రాష్ట్ర ఎన్నికల సంఘం నుంచి అవార్డు అందుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఎన్నికల విధుల్లో పడ్డ కష్టానికి గుర్తింపు వచ్చింది. ఈ అవార్డు నా బాధ్యతను మరింత పెంచింది’ అని పేర్కొంది.

–––––––––––––

Updated Date - 2023-01-25T00:35:36+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising