గుడిపాడుకు తపన ఫౌండేషన్ ద్వారా వాటర్ ట్యాంక్
ABN, First Publish Date - 2023-03-31T00:29:27+05:30
మండలంలోని గుడిపాడు గ్రామానికి తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి గురువారం వాటర్ ట్యాంకర్ను అందజేశారు.
ముసునూరు, మార్చి 30: మండలంలోని గుడిపాడు గ్రామానికి తపన ఫౌండేషన్ ఆధ్వర్యంలో గారపాటి సీతారామాంజనేయ చౌదరి గురువారం వాటర్ ట్యాంకర్ను అందజేశారు. శ్రీరామనవమి సందర్భంగా కోదండరాముడి ఆలయంలో వేడుకలు నిర్వహించారు. స్వామివారిని దర్శించుకుని వాటర్ ట్యాంకర్ను గ్రామ ప్రముఖులకు అందజేశారు. గారపాటి చౌదరి మాట్లాడుతూ గుడిపాడు గ్రామస్తుల విజ్ఞప్తిమేరకు ట్యాంకర్ ఇచ్చామన్నారు. జిల్లావ్యాప్తంగా పోలవరం, బీమడోలు, దెందులూరు, కామవరపుకోట, టి.నరసాపురంతో పాటు పలు మండలాల్లో తపన ఫౌండేషన్ ద్వారా 16 వాటర్ ట్యాంకర్లు సేవలం దిస్తున్నాయన్నారు. 2008 నుంచి తపన ఫౌండేషన్ ద్వారా వివిధ సేవా కార్యక్రమాలు చేపట్టామని, మరిన్ని సేవా కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. మారునేళ్ళ కృష్ణారావు, కొల్లి గంగారావు, మందలపు శివరామప్రసాద్, ఎం.మధుసూదన్రావు తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-31T00:29:27+05:30 IST