ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఓటుహక్కు తో సమర్థ పాలకులను ఎన్నుకోవాలి

ABN, First Publish Date - 2023-01-25T00:34:58+05:30

సమర్ధవంతమైన పాలనకు ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. 25న 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భీమవరం రాయలం రోడ్డులో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు.

రంగవల్లులను పరిశీలిస్తున్న పశ్చిమ కలెక్టర్‌ ప్రశాంతి
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కలెక్టర్‌ ప్రశాంతి

భీమవరం, జనవరి 24 : సమర్ధవంతమైన పాలనకు ఓటుహక్కు వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్‌ ప్రశాంతి అన్నారు. 25న 13వ జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా భీమవరం రాయలం రోడ్డులో మంగళవారం రెవెన్యూ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ముగ్గుల పోటీలను కలెక్టర్‌ ప్రారంభించారు. కలెక్టర్‌ మాట్లాడుతూ యువత ఓటుహక్కు విషయంలో సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని, 18 ఏళ్లు నిండిన ప్రతీ పౌరుడు ఓటును బాధ్యతగా స్వీకరించాలన్నారు. ఇన్‌చార్జి డీఆర్వో దాసిరాజు మాట్లాడుతూ 25న విష్ణు కళాశాలలో జాతీయ ఓటరు దినోత్సవం నిర్వహిస్తున్నామని, మధ్యాహ్నం 2 గంటల నుంచి బైక్‌ ర్యాలీ జరుగుతుందని తెలిపారు. ముగ్గుల పోటీలలో సుమారు 60 మంది పాల్గొన్నారని బీవీరాజు కళాశాలలో నిర్వహించే జాతీయ ఓటర్ల దినోత్సవ కార్యక్రమంలో విజేతలకు బహుమతులు, సీనియర్‌ ఓటర్లకు సత్కారం చేస్తామన్నారు. తహసీల్దార్‌ రవికుమార్‌, చెరుకువాడ రంగసాయి, షిథాల్‌ భవాని, రంగమణి, అమ్యులారావు, ఏసుబాబు, కంతేటి వెంకటరాజు పాల్గొన్నారు.

Updated Date - 2023-01-25T00:34:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising