ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

కబ్జా కోరల్లో..

ABN, First Publish Date - 2023-09-03T23:27:25+05:30

ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప్పుటేరు గట్లు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయి.

ఉప్పుటేరు వెంబడి అనధికార చెరువులు

ఉప్పుటేరు గట్లు ఆక్రమించి చేపలు, రొయ్యల చెర్వులు తవ్వకం

చూసీచూడనట్టుగా అధికారులు

బలహీనంగా మారిన గట్లు

కలిదిండి, సెప్టెంబరు 3 : ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించి ఉన్న ఉప్పుటేరు గట్లు కోతకు గురై ప్రమాదకరంగా ఉన్నాయి. ఏ క్షణంలో గండ్లు పడి గ్రామాలను ముంచెత్తుందోనని ఉప్పుటేరు తీర గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇటీ వల వచ్చిన తుఫాన్లకు ఉప్పుటేరు పొంగింది. ఆ సమ యంలో స్థానికులంతా బిక్కుబిక్కుమంటూ గడిపారు. ఉప్పుటేరు వెంబడి ఇరువైపులా సుమారు 30 గ్రామాలు ఉన్నాయి. సుమారు 50 వేల మంది జనాభా నివశిస్తు న్నారు. ఆకివీడు వంతెన నుంచి పెదలంక శివారు మట్లం వరకు 30 కిలోమీటర్ల మేర ఉప్పుటేరు గట్లను కొంతమంది బడా బాబులు ఆక్రమించి చేపలు, రొయ్యల చెరువులు తవ్వేయడంతో గట్లు బలహీన పడ్డాయి. ఏటిగట్టును ఆక్రమించి చెరువులుగా తవ్వుతున్నా డ్రెయి నేజీ అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నారని, ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడం లేదని ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా సంబం ధిత ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Updated Date - 2023-09-03T23:27:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising