వైసీపీ కార్యకర్త ఇంట్లో చోరీ
ABN, First Publish Date - 2023-03-13T23:48:58+05:30
వైసీపీ కార్యకర్త రంభ శివ ఇంట్లో బంగారపు వస్తువులు చోరీకి గురయ్యాయి. తండ్రి పెద కార్యం నిమిత్తం కుటుంబం ఈ నెల 8న తిరుపతి జిల్లా సిద్దిపల్లి గ్రామం వెళ్లి సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే సరికి తాళం పగలుగొట్టి ఉంది.
ఆకివీడు, మార్చి 13: వైసీపీ కార్యకర్త రంభ శివ ఇంట్లో బంగారపు వస్తువులు చోరీకి గురయ్యాయి. తండ్రి పెద కార్యం నిమిత్తం కుటుంబం ఈ నెల 8న తిరుపతి జిల్లా సిద్దిపల్లి గ్రామం వెళ్లి సోమవారం తెల్లవారుజామున ఇంటికి వచ్చే సరికి తాళం పగలుగొట్టి ఉంది. ఇంట్లోకి వెళ్లి చూడగా, బీరువా తెరిచి ఉంది. బంగారం కాసు కాయిన్స్–3, చెవి బుట్ట లు జత, దిద్దులు జత, చంపసరాలు జత, చెవి మాటీలు జత, సన్న మాటీలు జత, రోజువారి చెవి దిద్దులు చిన్నవి జత, ముక్కుపుడక, చైన్లో చిన్న ముక్కతో పాటు రూ.15వేలు దొంగిలించినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఎస్పీ రవిప్రకాష్, ఎస్ఐ కొవ్వూరు రాజారెడ్డి, ఏఎస్ఐ డి.సంజీవరావు, క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, క్రైం డిపార్ట్మెంట్ పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. శివ ఫిర్యాదు మేర ఏఎస్ఐ డి.సంజీవరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Updated Date - 2023-03-13T23:48:58+05:30 IST