ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరితగతిన కేసుల దర్యాప్తు

ABN, First Publish Date - 2023-05-31T23:55:06+05:30

కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఏలూరు క్రైం, మే 31 : కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో బుధవారం వీడియో కాన్పరెన్సును ఏలూరు పోలీస్‌ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ ట్రైల్స్‌లో ఉన్న కేసులలో ముద్దాయిలను కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, పెండింగ్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను అమలు చేయాలని, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి సంబంధిత కేసులో సాక్షుల చేత సాక్ష్యం ఇప్పించేలా ఎపీపీల వద్ద హాజరుపర్చాలని సూచించారు. ముద్దాయిలకు శిక్ష పడడం వల్ల నేరం చేయాలంటే నేరస్తుల్లో భయం కలగాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాద న్నారు. పలు కేసుల్లో తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఎస్పీ జారీ చేశారు. ఈ వీసీలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. సుబ్బారావు, బీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌, ఎస్‌ఐ సాధిక్‌లు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––

ఏలూరు క్రైం, మే 31 : కేసులను త్వరితగతిన దర్యాప్తు పూర్తి చేసి నిందితులను అరెస్టు చేసి ఛార్జిషీట్లను కోర్టులో దాఖలు చేయాలని ఎస్పీ మేరీ ప్రశాంతి ఆదేశించారు. జిల్లాలోని డీఎస్పీ, సీఐ, ఎస్‌ఐలతో బుధవారం వీడియో కాన్పరెన్సును ఏలూరు పోలీస్‌ కార్యాలయం నుంచి నిర్వహించారు. ఎస్పీ మాట్లాడుతూ పెండింగ్‌ ట్రైల్స్‌లో ఉన్న కేసులలో ముద్దాయిలను కోర్టుకు హాజరయ్యేలా చూడాలని, పెండింగ్‌ నాన్‌బెయిలబుల్‌ వారెంట్లను అమలు చేయాలని, సాక్షులను సకాలంలో కోర్టులో హాజరు పరిచి సంబంధిత కేసులో సాక్షుల చేత సాక్ష్యం ఇప్పించేలా ఎపీపీల వద్ద హాజరుపర్చాలని సూచించారు. ముద్దాయిలకు శిక్ష పడడం వల్ల నేరం చేయాలంటే నేరస్తుల్లో భయం కలగాలన్నారు. ఉద్యోగ నిర్వహణలో అధికారులు అలసత్వం ప్రదర్శించరాద న్నారు. పలు కేసుల్లో తగిన సూచనలు, సలహాలు, ఆదేశాలు ఎస్పీ జారీ చేశారు. ఈ వీసీలో స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ ఎం. సుబ్బారావు, బీసీఆర్‌బీ ఇన్‌స్పెక్టర్‌ దుర్గా ప్రసాద్‌, ఎస్‌ఐ సాధిక్‌లు పాల్గొన్నారు.

––––––––––––––––––––––––

Updated Date - 2023-05-31T23:55:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising