ఏమిటీ సాహసం..
ABN, First Publish Date - 2023-05-14T00:51:13+05:30
ప్రమాదమని తెలిసీ పరిమితికి మించి వాహనాల్లో కూలీలు పనులకు తరలి వెళ్తున్నారు. ఒక పక్క కూలీలు అధిక సంఖ్యలో వెళ్తున్న వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు.
కలిదిండి, మే 13 : ప్రమాదమని తెలిసీ పరిమితికి మించి వాహనాల్లో కూలీలు పనులకు తరలి వెళ్తున్నారు. ఒక పక్క కూలీలు అధిక సంఖ్యలో వెళ్తున్న వాహనాలకు ప్రమాదాలు జరుగుతున్నప్పటికీ పట్టించుకోవడం లేదు. రెండు నెలల క్రితం కోరుకొల్లు సమీపంలో బొలేరో వాహనం ప్రమాదానికి గురై బోల్తా పడటంతో ఒక మహిళా కూలీ మృతి చెందగా, మరో నలుగురు తీవ్ర గాయాలపాలయ్యారు. ఉదయాన్నే అధిక సంఖ్యలో కూలీలు వాహనాల్లో వలలతో చెరువుల్లో చేపల పట్టుబడికి వెళ్తున్నారు. చెరువుల వద్దకు తొందరగా వెళ్లాలనే ఉద్దేశ్యంతో మితిమీరిన వేగంతో వాహనాలను నడుపుతుండటంతో తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి. పరిమితికి మించి కూలీలు వాహనాల్లో తరలివెళ్తున్నప్పటికీ పోలీసులు చూసీ చూడనట్టు వ్యవహరిస్తున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
Updated Date - 2023-05-14T00:51:13+05:30 IST