మాముడూరులో ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ
ABN, First Publish Date - 2023-03-19T00:11:14+05:30
మాముడూరులో అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివా రం ఉదయం గోవిం ద నామ స్మరణల మధ్య గరుడ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు.
పెనుమంట్ర, మార్చి 18 : మాముడూరులో అలివేలు మంగా పద్మావతి సమేత వేంకటేశ్వర స్వామి ఆలయంలో శనివా రం ఉదయం గోవిం ద నామ స్మరణల మధ్య గరుడ, ధ్వజస్తంభ పునఃప్రతిష్ఠ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. మూడు రోజులుగా విశేష పూజలు, హోమాలను నిర్వహించారు. పూర్ణాహుతి నిర్వహించి కార్యక్రమాన్ని పరిసమాప్తి చేశారు. స్వామి, అమ్మవార్లకు, శాంతి కల్యాణం అనంతరం అన్నసమారాధన నిర్వమించారు. ఎంపీపీ కర్రీ వెంకటనారాయణ రెడ్డి పెనుమత్స విశ్వనాథరాజు, సర్పంచ్ గూడూరి దేవేంద్రుడు, వైస్ ఎంపీపీ వాసంశెట్టి కిరణ్ కుమార్ దంపతులు పాల్గొన్నారు.
Updated Date - 2023-03-19T00:11:14+05:30 IST