ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వరుడైన లక్ష్మీనారసింహుడు

ABN, First Publish Date - 2023-02-01T23:25:58+05:30

సుందరగిరిపై కొలువైన శ్రీలక్షీనారసింహుడు పెండ్లి కుమారుడయ్యారు. స్మార్త ఆగమ యుక్తంగా పాంచాహ్నిక దీక్షతో వేదమంత్రోచ్ఛరణలు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీకనకవల్లీ, లక్ష్మీఅమ్మవార్లు పెండ్లి కుమార్తెలయ్యారు.

పెండ్లికుమారుడు,పెండ్లికుమార్తెలుగా నరసన్న, అమ్మవార్లు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సుందరగిరిపై ప్రారంభమైన కల్యాణోత్సవాలు

ద్వారకా తిరుమల, ఫిబ్రవరి 1 : సుందరగిరిపై కొలువైన శ్రీలక్షీనారసింహుడు పెండ్లి కుమారుడయ్యారు. స్మార్త ఆగమ యుక్తంగా పాంచాహ్నిక దీక్షతో వేదమంత్రోచ్ఛరణలు. మేళతాళాలు, మంగళవాయిద్యాల నడుమ శ్రీకనకవల్లీ, లక్ష్మీఅమ్మవార్లు పెండ్లి కుమార్తెలయ్యారు. శ్రీవారి ప్రధాన ఆలయానికి దత్తత దేవాలయమైన మండలంలోని ఐఎస్‌. జగన్నాఽథపురంలో స్వామివారి దివ్య కల్యాణ మహోత్సవాలు బుధవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈనెల ఆరో తేదీ వరకు జరుగనున్న కల్యాణ మహోత్సవాలను ఘనంగా నిర్వహించేలా అధికారులు చర్యలు చేపట్టారు. ముందుగా ప్రత్యేకంగా అలంకరించిన వేదికపై స్వామి అమ్మవార్ల మూర్తులను ఉంచి అర్చకులు పుష్పాలంకరణ చేశారు. అనంతరం అట్టహాసంగా నరసన్నను, అమ్మవార్లను పెండ్లికుమారుడు పెండ్లికుమార్తెలుగా చేశారు. రాత్రి ఆలయంలో అంకురార్పణ, ధ్వజారోహణ, తదితర కార్యక్రమాలు వైభవంగా జరిగాయి. అధికసంఖ్యలో భక్తులు మూలవిరాట్‌ను, కల్యాణమూర్తులను దర్శించారు. సాయంత్రం ఆలయంలో ధ్వజారోహణను అర్చకులు, పండితులు వేదమంత్రోచ్ఛరణలతో నిర్వహించారు.

Updated Date - 2023-02-01T23:25:59+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising