ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మండుటెండలో బతుకు వేట

ABN, First Publish Date - 2023-05-26T00:09:43+05:30

ఎండలు సుర్రుమంటున్నాయి. ఉదయం 7 దాటితే కాలు బయటపెట్టడం కష్టంగా ఉంది. రోహిణి కార్తె ప్రారంభం రోజే ఎండ భగభగ మండింది. బయటకు రావాలంటేనే భయపోతున్న పరిస్థితిలో రోడ్డుపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి అవస్థలు వర్ణనాతీతం.

గణపవరం– భీమవరంలో రోడ్డులో రహదారి పక్కన నిమ్మకాయలు విక్రయిస్తున్న మహిళలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చిరు వ్యాపారులకు తప్పని వెతలు

దినసరి కూలీ కూడా గిట్టుబాటు కావడం లేదని ఆవేదన

రోహిణి కార్తె ప్రారంభం రోజే

మండిన ఎండలు

గణపవరం, మే 25: ఎండలు సుర్రుమంటున్నాయి. ఉదయం 7 దాటితే కాలు బయటపెట్టడం కష్టంగా ఉంది. రోహిణి కార్తె ప్రారంభం రోజే ఎండ భగభగ మండింది. బయటకు రావాలంటేనే భయపోతున్న పరిస్థితిలో రోడ్డుపై చిరు వ్యాపారాలు చేసుకునే వారి అవస్థలు వర్ణనాతీతం. ముంజులు, నిమ్మకాయలు, బొప్పాయి, మామిడి, పీతలు, చేపలు అమ్ముకునే వారిని చూస్తే మనసున్న వారికి బేరం అడగకుండా కొనాలనిపిస్తుంది. వారం రోజులుగా ఉష్ణోగ్రతలు 40 డిగ్రీలు దాటుతున్నాయి. దానికి తోడు రోహిణి ప్రారంభంతో ఎండల తీవ్రతకు ఉక్కబోత తట్టుకోలేకపోతున్నారు. డబ్బులున్నవారు ఏసీ రూమ్‌లు వదిలి రాలేకపోతున్నారు. రెక్కాడితే కాని డొక్కాడని నిరుపేదలు తమ బతుకు బండిని నడిపించేందుకు రోడ్కెక్కాలి వస్తోంది. ఎండలు లెక్కచేయకుండా గణపవరం నుంచి భీమవరం, తాడేపల్లిగూడెం వెళ్లే రహదారుల వెంబడి చిరు వ్యాపారులు విక్రయాలు చేస్తున్నారు. మండుటెండల్లో మెట్ట ప్రాంతాల నుంచి ఇటు డెల్టా ప్రాంతాల నుంచి ఆటో లేదా బస్సుల్లో వచ్చి అమ్మితే దినసరి కూలి కూడా గిట్టుబాటు అవడం లేదని వాపోతున్నారు.

రోజుకు రూ.1500 దాకా అమ్ముతాం

–రాజేష్‌, తాటిముంజుల వ్యాపారి, నీలాద్రిపురం

ముంజుల సీజన్‌లో ఇక్కడకు వచ్చి అమ్ముతుంటాం. డజను రూ.50 చొప్పున విక్రయిస్తున్నాం. రోజుకు రూ.1500 అమ్ముతాం.అందరూ లేత ముంజులు కావాలంటారు. కవర్లో పెట్టాక కొన్ని ఏరి పక్కన పెడతారు. మరొకటి కొసరు వేయమంటారు. ఎండల్లో అమ్ముతున్నారు..పాపం అని బేర మార కుండా కొనేవారు తక్కువ.ఎండైనా వానైనా బతకాలంటే తప్పదు కదా..

ఎండైనా తప్పదు మరి

–మహాల క్ష్మి, పీతల వ్యాపారి, కాకినాడ

ఎండ తీవ్రంగా ఉన్నా వ్యాపారం చేయక తప్పదు. కాకినాడ నుంచి పీతలు తీసుకొచ్చి ఇక్కడ అమ్ముతున్నా. వేసవిలో పీతల కొనుగోళ్లు తగ్గుతున్నాయి. కూలి గిట్టుబాటు కావడం లేదు. ఒక రోజు తెచ్చినవి మొత్తం అయిపోతాయి. ఒకో రోజు అవ్వవు. మిగిలివి గంపలో పెట్టుకుని ఊరికి వెళ్లిపోతాం. ఈ ఎండలో అమ్మకాలు సాగించకపోతే బేరాలు పోతాయి. అలవాటు తప్పుతుంది.

Updated Date - 2023-05-26T00:09:43+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising