మహిళా రెజ్లర్లకు న్యాయం జరిగే వరకు పోరాటం
ABN, First Publish Date - 2023-06-02T23:56:59+05:30
మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను తక్షణం అరెస్టు చేయాలని ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు.
క్రీడాకారులకు హమాలీ కూలీల మద్దతు
ఏలూరు టూటౌన్, జూన్ 2: మహిళా రెజ్లర్లపై లైంగిక వేధింపులకు పాల్పడిన బీజేపీ ఎంపీ బ్రిజ్ భూషణ్ను తక్షణం అరెస్టు చేయాలని ఐఎఫ్టీయూ ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు డిమాండ్ చేశారు. మార్కెట్ యార్డు వద్ద హమాలీలు శుక్రవారం ధర్నా నిర్వహించారు. వెంకట్రావు మా ట్లాడుతూ ప్రధాన మోదీ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం తగదన్నారు. రెజ్లర్లు ఆందోళన చేస్తున్నప్పటికి సమస్య పరిష్కరించకుండా వారిపై నిర్భం దాలు ప్రయోగిస్తూ అరెస్టు చేయడాన్ని ఖండించారు. వారికి న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామన్నారు. రెడ్డి అప్పలనాయుడు, ఎం.రాము, రమణ, కె.అప్పారావు, నాగేశ్వరరావు, గురుమూర్తి, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-06-02T23:56:59+05:30 IST