ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కమ్మనైన వివాహాలు కుదర్చడంలో40 సంవత్సరాల సుదీర్ఘ అనుభవం ఉన్న కాకతీయ మ్యారేజెస్‌లో ఇప్పుడు ప్రీమియం మెంబర్‌షిప్‌ ఉచితం ఫోన్|| 9390 999 999, 7674 86 8080

రూప్‌ చంద్‌ కిలో రూ.95

ABN, First Publish Date - 2023-06-25T23:40:08+05:30

రైతులకు సిరులు కురిపించిన రూప్‌చంద్‌ చేప పతనం దిశగా పయనిస్తోంది. కిలో రూ.115 పలికిన ధర ప్రస్తుతం రూ.95లకు పడిపోయింది.

పట్టుబడి చేసిన రూప్‌ చంద్‌ చేపలు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

గిట్టుబాటు కాక రైతుల నష్టాలపాలు

కలిదిండి, జూన్‌ 25 : రైతులకు సిరులు కురిపించిన రూప్‌చంద్‌ చేప పతనం దిశగా పయనిస్తోంది. కిలో రూ.115 పలికిన ధర ప్రస్తుతం రూ.95లకు పడిపోయింది. గిట్టుబాటు ధర లభించకపోవడంతో రైతులు నష్టాల పాలవుతున్నారు. దీనికి ప్రధాన కారణం ఉత్తరాది సముద్రపు చేప అధికంగా ఉత్పత్తి అవుతుండడంతో చెరువుల్లో పెంచే రూప్‌చంద్‌ ధర పతనమవుతోందని చెబుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఏప్రిల్‌ 1 నుంచి జూన్‌ 1వ తేదీ వరకు రెండు నెలల సమయం సముద్రపు చేప పట్టు బడులకు విరామం ప్రకటిస్తుంది. అనంతరం జూన్‌ 1 నుంచి మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్లి చేపలను పట్టి బహిరంగ మార్కెట్‌లో విక్రయానికి సిద్ధం చేస్తుంటారు. ఈ కారణంతోనే చెరువుల చేపల ధరలు తగ్గుముఖం పట్టాయని ఆందోళన చెందుతున్నారు. రూప్‌చంద్‌ చేప ఎక్కువగా కొనుగోలు చేసే అస్సోం, గుజరాత్‌, మహారాష్ట్ర, బిహార్‌ ప్రాంతాల్లో మన రాష్ట్రంలో పెంచే చేపలకు డిమాండ్‌ తగ్గింది. జనవరి వరకు ధర పెరగక పోవచ్చని వ్యాపారులు పేర్కొంటున్నారు. ధరల తగ్గు ముఖంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.

Updated Date - 2023-06-25T23:40:08+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising