నేటి నుంచి పది పరీక్షల మూల్యాంకనం
ABN, First Publish Date - 2023-04-19T00:03:12+05:30
వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు.
వీరవాసరంలో స్పాట్ కేంద్రాన్ని తనిఖీ చేసిన కలెక్టర్ ప్రశాంతి
భీమవరం, ఏప్రిల్ 18(ఆంధ్రజ్యోతి) : వీరవాసరం మద్దాల రామకృష్ణమ్మ జడ్పీ హైస్కూల్లో ఏర్పాటు చేసిన పదో తరగతి స్పాట్ వాల్యూయేషన్ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ ప్రశాంతి ఆకస్మిక తనిఖీ చేశారు. మంగళవారం సాయంత్రం జడ్పీ హైస్కూల్ను సందర్శించారు. ఈనెల 19 నుంచి 26 వరకూ పదో తరగతి పరీక్షల స్పాట్ వాల్యుయేషన్ను ఈ హైస్కూల్లో నిర్వహిస్తున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ వాల్యూయేషన్ పాల్గొనే ఉపాధ్యాయులుకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఎండతీవ్రత ఎక్కువగా ఉన్నందున అందుకు తగిన విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. హైస్కూల్లో 18 గదులను వాల్యూ యేషన్ నిమిత్తం కేటాయించారు. వీటిలో ఐదు గదులను స్ర్టాంగ్ రూంలకు కేటాయించారు. డీఈవో వెంకటరమణ, తహసీల్దార్ సుందర్రాజు, ఎంఈవో వినాయకుడు, హెచ్ం ప్రభామంజరి పాల్గొన్నారు.
Updated Date - 2023-04-19T00:03:12+05:30 IST