రెండిళ్లలో చోరీ
ABN, First Publish Date - 2023-08-22T00:06:37+05:30
పట్టణంలోని రెండిళ్లలో చోరీ ఘటనలు చోటు చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పట్టణ పోలీసు స్టేష న్ సీఐ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని సౌందర్య ఽథియేటర్ వీధిలో గల న్యాయవాది నీలం రాజేశ్వరరావు కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తీసి ఉండడంతో 20 తు లాల బంగారం, 2 కేజీల వెండి చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశా డు. కొత్తవలస సాయిరాం కాలనీలో నివాసముంటున్న సిరిపురపు చిరంజీవిరావు, గత నెలలో రాజస్థాన్లో ఉన్న తన కుమారుడు వద్దకు వెళ్లి సోమవారం తిరిగి పట్టణానికి వచ్చాడు. ఇంటి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉండడంతో పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఇంటిలోని 10 గ్రాముల బంగారంతో పాటు 8 తులాలు వెండి చోరికి గురైనట్లు ఫిర్యాదులో తెలియజేశాడన్నారు. వీటిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
పార్వతీపురంటౌన్, ఆగస్టు 21: పట్టణంలోని రెండిళ్లలో చోరీ ఘటనలు చోటు చేసుకున్నట్లు పట్టణ పోలీసులు తెలిపారు. దీనికి సంబంధించి పట్టణ పోలీసు స్టేష న్ సీఐ కృష్ణారావు ఒక ప్రకటన విడుదల చేశారు. పట్టణంలోని సౌందర్య ఽథియేటర్ వీధిలో గల న్యాయవాది నీలం రాజేశ్వరరావు కొన్ని రోజుల క్రితం బంధువుల ఇంటికి వెళ్లారు. సోమవారం ఇంటికి వచ్చి చూసే సరికి తలుపులు తీసి ఉండడంతో 20 తు లాల బంగారం, 2 కేజీల వెండి చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశా డు. కొత్తవలస సాయిరాం కాలనీలో నివాసముంటున్న సిరిపురపు చిరంజీవిరావు, గత నెలలో రాజస్థాన్లో ఉన్న తన కుమారుడు వద్దకు వెళ్లి సోమవారం తిరిగి పట్టణానికి వచ్చాడు. ఇంటి వచ్చి చూసే సరికి బీరువా తెరిచి ఉండడంతో పోలీసు లకు ఫిర్యాదు చేశాడు. చిరంజీవి ఇంటిలోని 10 గ్రాముల బంగారంతో పాటు 8 తులాలు వెండి చోరికి గురైనట్లు ఫిర్యాదులో తెలియజేశాడన్నారు. వీటిపై కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
యువకుడి ఆత్మహత్య
పార్వతీపురంటౌన్: యాసిడ్ తాగి యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన పట్టణంలో చోటు చేసుకుంది. దీనికి సంబంధించి జిల్లా ఆసుపత్రి ఔట్ పోస్ట్ పోలీ సులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని పెదమాదిగ వీధికి చెందిన పాలకొండ చంద్రశేఖర్ (30) పెయింటర్గా పనిచేస్తూ జీవనాధారం పొందుతు న్నాడు. ఈ క్రామంలో సోమవారం ఉదయం ఇంట్లోనే యాసిడ్ తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు వెంటనే జిల్లా కేంద్ర ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వెంటనే మరణించాడు. అయితే ఆత్మ హత్యకు గల కారణాలు తెలియరాలేదని, దీనిపై పూర్తిగా దర్యాప్తు నిర్వహించి వివ రాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు.
దొంగల హల్ చల్
కొమరాడ: మండంలో గుమడ సీతమాంభపురం(ఆగ్రహారం) గ్రామంలో సోమ వారం దొంగలు హల్చల్ చేశారు. ఉదయం 11 గంటల సమయంలో రెండు మోటా రు బైకులపై వచ్చిన ఇద్దరు మగవాళ్లు, ఇద్దరు ఆడవాళ్లు చిన్నబాబును తీసుకువచ్చి గ్రామంలో తిరుగుతూ ఇంటికి తాళం వేసి ఉన్న మడక జోగినాయుడు ఇంటిలోకి ప్ర వేశించి రూ. 50 వేలు నగదు, ఐదు గ్రాముల బంగారం చోరీ చేసినట్లు బాధితులు తెలిపారు. ఆ సమయంలో జోగినాయుడు ఇంటికి తాళం వేసుకుని పొలం పనుల కోసం వెళ్లాడు. ఇంటిలోకి ఎవరో ప్రవేశించారనే అనుమానంతో వీధిలో వారు చూసే సరికి అక్కడ నుంచి దొంగలు మెల్లగా జారుకున్నట్లు చెబుతున్నారు. జరిగిన ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ జగదీష్నాయుడు తెలిపారు.
Updated Date - 2023-08-22T00:06:37+05:30 IST