తాటిచెట్టును తొలగించారు
ABN, First Publish Date - 2023-06-01T00:17:54+05:30
బొండపల్లి మండలం, గొట్లాం గ్రామానికి సమీపంలో సుమారు 15 రోజుల క్రితం ఈదురుగాలులకు విద్యుత్ తీగలపై తాటిచెట్టు పడిపోయింది.
విజయనగరం (ఆంధ్రజ్యోతి) మే 31: బొండపల్లి మండలం, గొట్లాం గ్రామానికి సమీపంలో సుమారు 15 రోజుల క్రితం ఈదురుగాలులకు విద్యుత్ తీగలపై తాటిచెట్టు పడిపోయింది. దీంతో విద్యుత్ తీగలు తెగి పడే ప్రమాదం ఉందని హెచ్చరిస్తూ ‘ఎంతాటి నిర ్లక్ష్యమో’ అనే శీర్షికన ఈ నెల 30న ఆంధ్రజ్యోతి పత్రికలో వార్త ప్రచురితమైంది. దీనిపై స్పందించిన విద్యుత్ శాఖ అధికారులు బుధవారం ఉదయం తాటిచెట్టును తొలగించారు. దీంతో పరిసర ప్రాంతవాసులు ఊపిరి పీల్చుకున్నారు. కథనాలను ప్రచురించిన ఆంధ్రజ్యోతి పత్రికను అభినందించారు.
Updated Date - 2023-06-01T00:17:54+05:30 IST