ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రాజకీయ కక్షతో సరుగుడు తోట కాల్చేశారు

ABN, First Publish Date - 2023-03-14T00:13:09+05:30

బంగార్రాజుపేటలోగల తన ఐదెకరాల సరుగుడు తోటను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజకీయ కక్షతో కాల్చి, బూడిద చేశారని కాగితాల సత్యనారాయణరెడ్డి సోమవారం విలేకర్లకు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ప్రవేశం ఉచితం. సం|| 9393 763 666

డెంకాడ: బంగార్రాజుపేటలోగల తన ఐదెకరాల సరుగుడు తోటను ఆదివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు రాజకీయ కక్షతో కాల్చి, బూడిద చేశారని కాగితాల సత్యనారాయణరెడ్డి సోమవారం విలేకర్లకు తెలిపారు. ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ, చాలా కాలం నుంచి తమ కుటుంబం టీడీపీలో కొనసాగుతోందని చెప్పారు. తన భార్య ఎంపీపీగా, తాను ఎంపీటీసీగా, పూసపాటిరేగ ఏఎంసీ వైస్‌ చైర్మన్‌గా గతంలో పదవులు చేపట్టామని తెలిపారు. గత మూడేళ్లగా కొందరు వ్యక్తులు రాజకీయంగా తమ కుటుంబాన్ని వేధిస్తున్నారని, రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు. ఎప్పటికీ లొంగకపోవడంతో ఆర్థికంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో తన ఐదెకరాల సరుగుడు తోటను కటింగ్‌ దశలో ఉండగా కాల్చి, బూడిద చేశారని తెలిపారు. మరో పది రోజుల్లో తోటను రూ.15లక్షలకు అమ్మివేస్తున్న తరుణంలో ఈ దుశ్చర్యకు పాల్పడ్డారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయమై స్థానిక పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశానని, న్యాయం జరిగేవరకు పోరాడుతానని తెలిపారు.

Updated Date - 2023-03-14T00:13:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising