బాలికల బంగారు భవిష్యత్తుకు సుకన్య సమృద్ధి యోజన
ABN, First Publish Date - 2023-02-05T00:18:59+05:30
ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని పోస్టల్శాఖ ఏఎస్పీ శ్రీనివాసరావు కోరారు.
భోగాపురం: ఆడపిల్లల బంగారు భవిష్యత్తు కోసం సుకన్య సమృద్ధి యోజన పథకంలో చేరాలని పోస్టల్శాఖ ఏఎస్పీ శ్రీనివాసరావు కోరారు. భోగాపురం గ్రామంలో శని వారం తపాలా శాఖ ఆధ్వర్యంలో సుకన్య సమృద్ధి యోజన పథకంపై ఆడపిల్లల తల్లులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ పదే ళ్ల లోపు వయసుగల బాలికలకు ఈ పథకంలో ఖాతా తెర వచ్చన్నారు. రూ.250 నుంచి పొదుపు చేసుకోవచ్చని చెప్పా రు. ఈ పొదుపు 15 ఏళ్లు మాత్రమే చెల్లించాలని, 21 ఏళ్ల తర్వాత వడ్డీతో అందజేస్తారని తెలిపారు. ఇందులో 18 ఏళ్ల వయస్సులో విద్య కోసం 50శాతం పొదుపు చేసిన సొమ్ము ను పొందవచ్చని చెప్పారు. ఆర్థిక సంవత్సరానికి రూ.250 మొదలుకొని రూ.1.50లక్షలు వరకు చెల్లించుకోవచ్చని తెలి పారు. అలాగే ఈనెల 9, 10 తేదీల్లో పోస్టాఫీసుల్లో మెగా మేళా ఉంటుందని, పూర్తి సమాచారం కోసం దగ్గర్లో తపా లా కార్యాలయాల పోస్టుమాస్టర్లను సంప్రదించవచ్చ న్నారు. ఈ కార్యక్రమంలో సబ్పోస్టుమాస్టర్ పి.శ్రీనివాస రావు, సంతోష్, తదితరులు పాల్గొన్నారు.
Updated Date - 2023-02-05T00:19:01+05:30 IST