ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రేపటిలోగా జీతాలు చెల్లించాల్సిందే..

ABN, First Publish Date - 2023-02-11T00:05:50+05:30

రేపటిలోగా జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్‌ నేతలు హెచ్చరించారు.

డీఈవో కార్యాలయం వద్ద మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేస్తున్న ఉపాధ్యాయులు
అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో టీచర్ల వినూత్న నిరసన

పార్వతీపురంటౌన్‌, ఫిబ్రవరి 10 : రేపటిలోగా జీతాలు చెల్లించకపోతే నిరవధిక సమ్మెలోకి వెళ్తామని యూటీఎఫ్‌ నేతలు హెచ్చరించారు. పదో తేదీ వచ్చినా ఈనెల ఇంకా జీతాలు చెల్లించకపోవడంపై పార్వతీపురంలోని డీఈవో కార్యాలయం వద్ద యూటీఎఫ్‌ ఆధ్వర్యంలో ఉపాధ్యాయులు శుక్రవారం మోకాళ్లపై నిల్చొని నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా యూటీఎఫ్‌ జిల్లా నాయకుడు ఎస్‌.మురళీమోహన్‌రావు మాట్లాడుతూ.. అన్ని శాఖల ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించగా, ఇప్పటివరకు ఉపాధ్యాయులకు ఎందుకు వేతనాలు చెల్లించడం లేదని ప్రశ్నించారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాన్ని విడుదల చేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యాయ, ఉద్యోగులు ఈ సమాజంలో భాగమని, ఈ విషయం ప్రభుత్వానికి తెలియదా? అని అన్నారు. అధికారంలోకి రాక ముందు ముద్దులొలికే మాటలు గుప్పించి.. ఇప్పుడు ఉపాధ్యాయ, ఉద్యోగులపై పిడిగుద్దులా? అని మండిపడ్డారు. ఇలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే సర్కారుకు తగిన గుణపాఠం చెప్పడం తప్పదన్నారు.

Updated Date - 2023-02-11T00:05:51+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising