ఓటరు పరిశీలనలో పాల్గొనండి
ABN, First Publish Date - 2023-07-21T00:10:04+05:30
ఓటరు పరిశీలన కార్యక్రమంలోబీఎల్ఓలతో పాటు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్చార్జ్లు పాల్గొని వెరిఫికేషన్, హౌస్ మ్యాపింగ్ చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి సూచించారు.
కురుపాం: ఓటరు పరిశీలన కార్యక్రమంలోబీఎల్ఓలతో పాటు తెలుగుదేశం పార్టీ బూత్ ఇన్చార్జ్లు పాల్గొని వెరిఫికేషన్, హౌస్ మ్యాపింగ్ చేయాలని నియోజకవర్గ ఇన్చార్జి తోయక జగదీశ్వరి సూచించారు. గురువారం కురుపాం టీడీపీ కార్యాలయంలో ఇంటిగ్రేటెడ్ ట్రైనింగ్ ప్రోగాం నిర్వహించారు. ఈ సందర్భంగా జగదీశ్వరి మాట్లాడుతూ ఎన్నికలు ఎప్పుడు వచ్చినా సిద్ధంగా ఉండాలని అన్నారు. టీడీపీ నాయకులు వైరిచర్ల వీరేష్ చంద్రదేవ్, నందివాడ కృష్ణబాబు, బీహెచ్వీ రమణ కుమార్, మండల కన్వీనర్ కేవీ కొండయ్య, బూత్ ఇన్చార్జ్లు పాల్గొన్నారు. ఫ కొమరాడ: ఓట రు వెరిఫికేషన్లో ప్రతి బూత్ ఇన్చార్జి పాల్గొవాలని టీడీపీ కురుపాం నియోజక వర్గ ఇన్చార్జి జగదీశ్వరి అన్నారు. గురువారం కొమరాడ మండల కేంద్రలో పార్టీ మండల కన్వీనర్ ఉదయశేఖరపాత్రుడు ఆధ్వర్యంలో ఇంటిగ్రేటెడ్ శిక్షణ జరిగింది. వీరేష్చంద్ర దేవ్, నందివాడ కృష్ణబాబు, గులిపల్లి సుదర్శనరావు, నంగిరెడ్డి మధుసూదనరావు, పి.వెంకటనాయుడు, బూత్ కమిటీ ఇన్చార్జిలు, డివిజన్ ఇన్చార్జిలు పాల్గొన్నారు.
Updated Date - 2023-07-21T00:10:04+05:30 IST